ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా గూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై నుంచి రోడ్డుపై పడిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు.... సి.బెళగాల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బాలకృష్ణ, గజ్జలమ్మ, జానమ్మగా గుర్తించారు.
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం వార్తలు
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
![కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9733536-1000-9733536-1606876860649.jpg)
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి