అది ఎక్కడి నుంచి వస్తుంది.., ఎవరు తీసుకెళ్తున్నారు.. ఇందులో ఎంతమంది ప్రమేయం ఉంది..? అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు డీఆర్ఐ ధికారులు తెలిపారు.
రూ. 71.38 లక్షల విలువ చేసే మత్తు పదార్థాల స్వాధీనం - టాన్చెరు మండలం ఇస్నాపూర్లో కంటైనర్లో తనిఖీలు
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న కంటైనర్పై డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 356 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, కంటైనర్ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇస్నాపూర్లో 356 కిలోల గంజాయి స్వాధీనం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ డీఆర్ఐ అధికారులు గంజాయి పట్టుకున్నారు. ముంబై జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న... పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు కంటైనర్పై తనిఖీలు నిర్వహించారు. అందులో 156 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. రూ. 71.38 లక్షల విలువ చేసే 356.9 కిలోల మత్తుపదార్థాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న కంటైనర్ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: 'సైకిల్'కు ఇక స్వర్ణ యుగమే!