శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తెచ్చిన బంగారు బిస్కెట్లు, విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత - హైదరాబాద్ తాజా వార్తలు
బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజా దుబాయ్ నుంచి హైదరాబాద్కు బంగారం తీసుకొస్తూ ఓ ప్రయాణికుడు పట్టబడ్డాడు.

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
రూ.18.36 లక్షల విలువైన 349.8 గ్రాముల బంగారు బిస్కెట్లు, రూ.12 లక్షలు విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:బాహ్య వలయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Last Updated : Jan 7, 2021, 10:18 PM IST