తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌదీ చమురు కేంద్రాలపై మరోసారి దాడులు!

సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కేంద్రాలపై మరిన్ని దాడులకు వ్యూహాలు రచిస్తున్నట్లు స్పష్టం చేశారు హుతీ తిరుగుబాటుదారులు. అందుకే అక్కడున్న విదేశీయులందరూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని హెచ్చరించారు.

By

Published : Sep 17, 2019, 5:58 AM IST

Updated : Sep 30, 2019, 10:06 PM IST

సౌదీ చమురు కేంద్రాలపై మరోసారి దాడులు?

సౌదీ చమురు కేంద్రాలపై మరోసారి దాడులు!

సౌదీ అరేబియాలోని ఆరాంకో చమురు శుద్ధి కేంద్రాలపై జరిగిన దాడికి బాధ్యత తమదేనని హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ చమురు కేంద్రాలపై మరిన్ని దాడులకు పాల్పడనున్నట్లు తాజాగా వెల్లడించారు. విదేశీయులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని హెచ్చరించారు.

తూర్పు సౌదీ అరేబియాలోని అబ్‌కైక్‌, ఖురైస్‌లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై గత శనివారం యెమెన్​కు చెందిన హుతీ​ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేశారు. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య విభేదాల వల్లే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. తిరుగుబాటుదారులకు ఇరాన్‌ గత కొన్నేళ్లుగా సాయం చేస్తోంది. ఇరాన్‌-సౌదీ అరేబియాల మధ్య విభేదాల నేపథ్యంలో... హుతీ-సౌదీ అరేబియా మధ్య కూడా చాలాకాలంగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే హుతీలు తాజా దాడులకు పాల్పడ్డారు.

పెరిగిన చమురు ధరలు

డ్రోన్​ దాడిలో ఆరాంకో చమురు కేంద్రాల్లో భారీగా మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి వల్ల చమురు శుద్ధి ప్రక్రియ భారీగా నిలిచిపోయింది. ఫలితంగా చమురు ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి.

దాడికి పాల్పడింది ఇరానే

డ్రోన్ దాడులు తమ పనేనని యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు చెబుతున్నారు. కానీ ఇరాన్​ ఈ దాడులను జరిపిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇందుకు ప్రతి చర్యగా దెబ్బ తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తెలిపారు.

"సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై దాడి జరిగింది. నిందుతులెవరో మాకు తెలుసు. వారిని మట్టుపెట్టేందుకు అమెరికా సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఘటనకు కారకులెవరన్న విషయంలో సౌదీ స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాం. వారు చేప్పే విషయాన్ని బట్టి ముందుకెళ్తాము."

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

Last Updated : Sep 30, 2019, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details