తెలంగాణ

telangana

ETV Bharat / international

యెమెన్​లో క్షిపణి దాడి- 17 మంది మృతి

యెమెన్​లో హౌతీ తీవ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో 17 మంది మరణించారు. మరిబ్ నగరంలోని గ్యాస్ ప్లాంట్​ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు.

By

Published : Jun 6, 2021, 1:21 AM IST

Updated : Jun 6, 2021, 1:45 AM IST

Houthi rebel missile hits Yemen
యెమెన్​లో క్షిపణి దాడి

యెమెన్​లో హౌతీ తీవ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి సైతం ఉందని ఆ దేశ సైన్యాధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డట్లు పేర్కొన్నారు.

మరిబ్​ నగరంలోని మరిబ్ నగరంలోని గ్యాస్ ప్లాంట్​ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు వివరించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రోన్ల సాయంతో అంబులెన్సులపైనా దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.

అయితే తాజా దాడిపై హౌతీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇదీ చదవండి :పాదచారులపై కత్తితో దాడి- ఐదుగురు మృతి!

Last Updated : Jun 6, 2021, 1:45 AM IST

ABOUT THE AUTHOR

...view details