అమెరికా దళాల చేతిలో ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ అతి దారుణంగా హతమయ్యాడు. ఆ తర్వాత బకర్ వారసుడిగా అబి ఇబ్రహీం అల్- హషీమి-అల్ ఖురేషీని ప్రకటించింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ. అయితే ఖురేషీ ఎక్కుడున్నాడన్నది ఇంకా రహస్యంగా ఉండటం.. ఉగ్రసంస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని జిహాదీ బృందం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"ఖురేషీ ఇస్లామిక్ స్టేట్ అధినేత, ఇస్లామిక్ న్యాయ కమిటీ (షారియా)కి పెద్ద అని తప్ప.. ఇతర వివరాలు మాకు పూర్తిగా తెలియదు. అసలు ఖురేషీ బతికే ఉన్నాడా అనే ప్రశ్న మాకూ ఉత్పన్నమవుతోంది".
-హిషాం అల్-హషేమి, ఇరాక్ నిపుణుడు
బాగ్దాదీ అనూహ్య మరణం అనంతరం సందిగ్ధంలో పడిన ఐసిస్.. పరిస్థితులు తమ చెయ్యి దాటి పోలేదని ప్రపంచానికి చెప్పడానికే ఖురేషీని తమ వారసుడిగా ప్రకటించి ఉండొచ్చని కొందరు విశ్వసిస్తున్నారు.
నిజమైన వారసుడిని అన్వేషించేందుకే.. ఖురేషీ పేరును పావుగా వాడుకోవడానికి ఐసిస్ నిర్ణయించిందనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సందిగ్ధతకు స్వస్తి పలకాలంటే ఖురేషీ తన గుర్తింపును బహిరంగపరచాలని అరబ్ విశ్వవిద్యాలయ నిపుణుడు జీన్- పియోర్ ఫలియు తెలిపారు.
అంతర్గత కలహాలు...!