తెలంగాణ

telangana

ETV Bharat / international

యెమెన్​లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగుల కిడ్నాప్​

UN Yemen news: యెమెన్​లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగులు కిడ్నాప్​కు గురయ్యారు. వారిని అల్​ఖైదా ఉగ్రవాదులు అపహరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని నిర్ధరించిన యూఎన్​.. దీనిపై స్పందించేందుకు మాత్రం నిరాకరించింది.

By

Published : Feb 13, 2022, 12:16 PM IST

UN Yemen news
un kidnapped in yemen

UN Yemen news: దక్షిణ యెమెన్​లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని అల్​ఖైదా ఉగ్రవాదులు అపహరించినట్లు యెమెన్​ అధికారులు శనివారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం వారిని ఎత్తుకెళ్లి, గుర్తుతెలియని ప్రదేశానికి తరలించినట్లు వెల్లడించారు. వారిలో నలుగురు యెమెన్ దేశస్థులు, ఒక విదేశీయుడు ఉన్నారు. దీని గురించి తమకు తెలుసని, పలు కారణాల వల్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని యూఎన్​ అధికార ప్రతినిధి స్టెఫనీ డుజారిక్ అన్నారు.

అయితే అపహరణకు గురైనవారిని సురక్షితంగా విడిపించేందుకు కిడ్నాపర్లతో చర్చలు జరుపుతున్నట్లు ట్రైబల్​ నేతలు తెలిపారు. వారు డబ్బులతో పాటు యెమెన్​లో బందీలుగా ఉన్న ఉగ్రవాదులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. యూఎన్​ సిబ్బందిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు యెమెన్​ ప్రభుత్వం కూడా తెలిపింది.

కిడ్నాప్​లు సాధారణమే!

యెమెన్​లో అపహరణలు తరచుగా జరుగుతుంటాయి. ఇక్కడ సాయుధ గిరిజనులు, అల్​ఖైదాతో సంబంధమున్న ఉగ్రవాదులు.. డబ్బులు, బందీలను విడిపించుకునేందుకు కిడ్నాప్​లకు పాల్పడుతుంటారు. వీరు అమెరికాలోనూ దాడులకు పాల్పడుతుంటారు.

దాడులు ఎందుకు?

Yemen News: 2014లో ఇరాన్​ మద్దతుతో హౌతీలు.. రాజధాని సనాను చేజిక్కించుకున్నప్పటి నుంచి యెమెన్​లో అంతర్యుద్ధం మొదలైంది. సనా సహా దేశంలోని ఉత్తర భాగాన్ని హౌతీలు హస్తగతం చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం తొలుత దక్షిణాది రాష్ట్రాలకు, ఆ తర్వాత సౌదీ అరేబియాకు తరలిపోవాల్సి వచ్చింది.

Yemen Humanitarian Crisis: ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని కూటమి 2015 మార్చిలో యుద్ధంలోకి ప్రవేశించింది. హౌతీ స్థావరాలపై అనేక సార్లు వైమానిక దాడులు జరిపింది. ఇరు పక్షాల పరస్పర దాడులతో యెమెన్​లో తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడింది.

ఇదీ చూడండి:జైలుపై వైమానిక దాడి.. 100మంది ఖైదీలు మృతి

ABOUT THE AUTHOR

...view details