ఇజ్రాయెల్ - జోర్డాన్ మధ్య విస్తరించి పెద్ద కొలనులా కనిపిస్తుంది మృత సముద్రం. ప్రస్తుతం ఇది ఉనికి కోల్పోతోంది. 1980లో సముద్ర మట్టం 400 మీటర్ల కన్నా తక్కువగా ఉండేది. నేడు 430 మీటర్ల దిగువకు పడిపోయింది. సముద్ర తీరం దాదాపు 2 కిలోమీటర్లు లోపలికి వెళ్లిపోయింది.
ఖనిజాల వెలికితీత కోసం మృత సముద్రంలో విచ్చలవిడిగా జరిపిన తవ్వకాలే ఇందుకు కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏటా వివిధ నదుల నుంచి 130 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు మృత సముద్రంలో కలుస్తుంది. ఆ నదులన్నీ ప్రస్తుతం వేగంగా ఎండిపోతున్నాయి. ఈ సముద్రంలోకి ప్రధానంగా నీటిని పంపే నదులు హెర్మోన్ పర్వతంలో ఉద్భవిస్తాయి. ఈ నీటిని 70 శాతం వరకు సముద్రంలోకి చేరకుండా జోర్డాన్ నదిపై ఆనకట్టలు నిర్మించారు. ఫలితంగా మృత సముద్ర ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
"1947, 1945లో ఇక్కడ నిలబడి మృత సముద్రంలోని నీటి మట్టం చూశాను. అప్పుడు నీటిమట్టం సముద్ర మట్టానికి 400 మీటర్ల దిగువన ఉంది. నేడు నీటి మట్టం సముద్ర మట్టానికి 434, 435 మీటర్ల దిగువన ఉంది. మృత సముద్రం నీటి మట్టం 30 మీటర్ల కంటే ఎక్కువ పడిపోయింది. నీటి మట్టం పతనానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణం. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల చర్యల వల్ల ఇది జరుగుతోంది. జోర్డాన్ నదిపై ఆనకట్ట నిర్మించడం వల్ల కూడా మృత సముద్ర మట్టం తగ్గుతోంది."
-మార్డెచాయ్ స్టెయిన్, భూవిజ్ఞాన శాస్త్రవేత్త