అఫ్గానిస్థాన్ తూర్పు నంగార్హర్ ప్రాంతంలోని ఓ స్టేడియంలో వీసాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంతో తొక్కిసలాట జరిగి 11మంది మృతి చెందారు. సాకర్ స్టేడియంలో జరిగిన ఈ ఘటన వివరాలనుప్రభుత్వ అధికారి అతుల్లా ఖోగ్యాని వెల్లడించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులని ధృవీకరించారు. గాయపడ్డ వారిలో మహిళలే అధికంగా ఉన్నారని తెలిపారు. వీరంతా పాకిస్థాన్కు వెళ్లేందుకు వీసాల కోసం వచ్చినట్లు వివరించారు.
నంగార్హర్లో ఉన్న పాకిస్థాన్ కాన్సులేట్ కరోనా దృష్ట్యా మూసివేశారు. ఇటీవల తెరుచుకోవటంతో భారీ సంఖ్యలో జనం తరలివచ్చారని తెలిపారు. గత వారం 19వేల వీసాలు జారీ చేసినట్లు వివరించారు. అఫ్గాన్లో వరుస దాడులు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం కారణంగా అనేక మంది పాకిస్థాన్కు పయనమవుతున్నారని వెల్లడించారు.
మరో ఘటన..