ఇరాక్ దక్షిణ బగ్దాద్లోని అమెరికా బలగాల స్థావరానికి సమీపంలో రాకెట్ దాడులు జరిగాయి. బాలాద్ ఎయిర్ బేస్కు సమీపంలో రెండు రాకెట్లతో దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. బలగాల ఉపసంహరణపై అమెరికా-ఇరాక్ చర్చలు జరపడానికి ముందు ఈ రాకెట్ దాడులు జరగడం గమనార్హం.
ఏప్రిల్ 7న ఇరాక్ ప్రభుత్వం అమెరికాతో నాలుగోసారి చర్చలు జరపనుంది. ట్రంప్ అధికారంలో ఉండగా గత ఏడాది జూన్లో చర్చలు ప్రారంభమయ్యాయి. బైడెన్ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరాక్లో ఉన్న అమెరికా బలగాల ఉపసంహరణ సహా ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి.