తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇరాన్​ చర్యలతో ప్రమాదంలోకి ఇరాక్​'

ఇరాకీలు అమెరికా బలగాలకు దూరంగా ఉండాలని ఇరాన్​కు చెందిన కటేబ్ హిజ్​బుల్లా దళాలు హెచ్చరించిన నేపథ్యంలో అగ్రరాజ్యం తీవ్రంగా స్పందించింది. ఇరాన్​ దుశ్చర్యలను ఇరాకీలు ఎండగట్టాలని ట్వీట్ చేశారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. ఇరాక్​ ప్రభుత్వం ఏమి చేయాలో ఇరాన్​ చెప్పటం వల్ల ఆ దేశ పౌరులను ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

By

Published : Jan 5, 2020, 10:52 AM IST

Pompeo decries pro-Iran factions warning to Iraqi troops
'ఇరాన్​ చర్యలతో ప్రమాదంలో ఇరాక్'

ఇరాక్​ అనుబంధ దళం కటేబ్​ హిజ్​బుల్లాపై విమర్శలు గుప్పించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. ఇరాకీలు అమెరికా బలగాలకు దూరంగా ఉండాలని హెచ్చరించటంపై తీవ్రంగా స్పందించారు. ఇరాన్​ దుశ్చర్యలను ఎండగట్టాలని కోరుతూ ట్వీట్​ చేశారు. ఇరాక్​ ప్రభుత్వం ఏమి చేయాలో ఇరాన్​ చెప్పటం ద్వారా ఇరాకీలను ప్రమాదంలో పడేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్​ చర్యలతో ఇరాక్​ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.

'ఇరాన్​ చర్యలతో ప్రమాదంలో ఇరాక్'

"అమెరికన్లతో కలిసి పని చేసే మంచి వారైన ఇరాకీలను కటేబ్ హిజ్​బుల్లా దుండగులు బెదిరింపులకు పాల్పడుతూ.. దూరంగా వెళ్లమంటున్నారు. ఇరాన్​ చర్యలు ఇరాక్​ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఇరాక్ ప్రజలు ఇరాన్​ నుంచి విముక్తులు కావాలని కోరుకుంటున్నారు. ఇరాక్​లోని ఇరాన్​ రాయబార కార్యాలయాన్ని ఇటీవల దహనం చేయడమే ఇందుకు నిదర్శనం. ఇది ఇరాన్​పై ఇరాకీల ఆగ్రహాన్ని తెలియజేస్తుంది."

-మైక్ పాంపియో, యూఎస్ విదేశాంగ మంత్రి

ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్య అనంతరం పశ్చిమాసియాలో యుద్ధ వాతవరణం నెలకొంది. తాజాగా అమెరికా సైనికులే లక్ష్యంగా రాకెట్లతో ఇరాన్ దాడికి పాల్పడగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా ఇరు దేశాల మధ్య ఈ ఘటన తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. సులేమానీ హత్యకు ఇరాన్ అనుబంధ దళం కటేబ్ హిజ్​బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనింది. ఇరాకీలు అమెరికా బలగాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details