తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజాపై మరోమారు ఇజ్రాయెల్​ రాకెట్ల వర్షం! - పాలస్తీనా, ఇజ్రాయెల్​ పరిస్థితులపై చర్చించనున్న ఐరాస

గాజా నగరంపై ఇజ్రాయెల్​ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పలు భవనాలు లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్​ వైమానిక దళాలు దాడికి దిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Israeli airstrike
గాజాపై ఆగని దాడులు.. భవంతులు, రోడ్లు ధ్వంసం

By

Published : May 16, 2021, 10:01 AM IST

ఇజ్రాయెల్​, పాలస్తీనా మధ్య రాకెట్ల దాడి కొనసాగుతోంది. ఆదివారం తిరిగి గాజాపై వైమానిక దాడి చేసింది ఇజ్రాయెల్​. ఈ దాడిలో నగరంలోని పలు భవంతులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. స్థానికంగా ఉండే ప్రజలు, జర్నలిస్టులు దాడికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. గాజా స్ట్రిప్​లో అతిపెద్ద ఆసుపత్రి అయిన షిఫాకు వెళ్లే మార్గమధ్యంలో పెద్ద గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఈ దాడిలో ఇద్దరు మరణించిట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 25 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు చెప్పింది. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురిని బయటకు తీసినట్లు చెప్పారు.

ఈ ఘటనపై ఇజ్రాయెల్​ మిలిటరీ ఎటువంటి ప్రకటన చేయలేదు. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటివరకు చాలా మంది మరణించగా, ఎందరో గాయపడ్డారని షిఫా ఆసుపత్రి డైరెక్టర్ మహ్మద్​ అబూ సెల్మియా ఒక ప్రకటనలో తెలిపారు.

ఐరాస సమావేశం..

పాలస్తీనా, ఇజ్రాయెల్​ల మధ్య కొనసాగుతన్న సంక్షోభంపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం సమావేశం కానుంది. సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్​ ఇరు దేశాల రాయబారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మిడిల్ ఈస్ట్ శాంతి స్థాపన కోసం నియమించిన ఐరాస ప్రత్యేక కోఆర్డినేటర్ టోర్ వెన్నెస్లాండ్​తో కూడా మాట్లాడనున్నారు.

ఇదీ చూడండి:'గాజాపై మరిన్ని రాకెట్లతో విరుచుకుపడతాం'

ABOUT THE AUTHOR

...view details