తెలంగాణ

telangana

ETV Bharat / international

యూఏఈలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం - యూఏఈ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం

యూఏఈలో రాయబార కార్యాలయాన్ని నెలకొల్పినట్లు ఇజ్రాయెల్​ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు విస్తృత పరిచేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని పేర్కొంది. మరోవైపు, ఇజ్రాయెల్​లో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయం తీసుకుంది.

israel-opens-embassy-in-uae-expanding-new-relations
యూఏఈలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం

By

Published : Jan 25, 2021, 4:54 AM IST

ఇజ్రాయెల్​, యూఏఈ మధ్య సంబంధాల పునరుద్ధరణ దిశగా మరో ముందడుగు పడింది. యూఏఈలో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రస్తుతం తాత్కాలిక కేంద్రంలో ఏర్పాటు చేసిన రాయబార కార్యాలయాన్ని.. త్వరలోనే శాశ్వత ప్రాంతానికి తరలించనున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత విస్తృతపరిచేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గబి అష్కెనాజి పేర్కొన్నారు.

త్వరలో మొరాకోతో పాటు, దుబాయ్​లో రాయబార కార్యాలయాల​ను ప్రారంభించనున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది. బహ్రెయిన్​లో ఇప్పటికే తమ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.

యూఏఈ సైతం

మరోవైపు, యూఏఈ సైతం ఇజ్రాయెల్​లో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రాజధాని టెల్ అవివ్​లో ఎంబసీని నెలకొల్పాలని యూఏఈ ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని గల్ఫ్ న్యూస్ తెలిపింది.

పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని గతేడాది ఆగస్టులో ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో తొలిసారి ఓ అరబ్ దేశం ఇజ్రాయెల్​తో సాధారణ సంబంధాలు నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details