అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాక్లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్(కుర్ద్ ఫోర్స్) జనరల్ ఖాసీం సులేమానీ హత్యతో ట్రంప్కు సంబంధం ఉన్నట్టు అభియోగం మోపింది.
గతేడాది జనవరిలో అమెరికా సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో సులేమానీతో పాటు ఇరాక్ కతైబ్ హిజ్బుల్లా డిప్యూటీ కమాండర్ అబు మహదీ అల్ ముహందీస్ హతమయ్యారు. ఆ తర్వాత అమెరికా-ఇరాక్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
బాగ్దాద్లో ఓ కోర్టు మోపిన నేరారోపణ రుజువైతే మరణశిక్షకు దారితీస్తుంది. అయితే ఇది సాధ్యమయ్యే పనికాకపోయినప్పటికీ.. అధ్యక్షుడిగా ట్రంప్ చివరిల్లో ఇరాక్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.
ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని, మహదీ అల్ ముహందీస్ కుటుంబసభ్యుల వాదనను విన్న అనంతరం అరెస్ట్ వారెంట్ జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ఇరాక్ సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి:-జనవరి 20కి ముందే ట్రంప్పై వేటు!