2015 అణు ఒప్పందం పునరుద్ధరణకు చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్ తన వైఖరిని కఠినతరం చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఐఈఏ) తనిఖీదారులకు తమ అణుకేంద్రాల ఫొటోలు, సమాచారం ఇవ్వమని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేల్ కలిబాఫ్ అన్నారు. డిసెంబరులోనూ ఇలాంటి హెచ్చరికనే ఇరాన్ జారీ చేసింది.
'తనిఖీదారులకు అణుకేంద్రాల ఫొటోలు ఇవ్వం' - ఇరాన్ స్పీకర్ మహ్మద్ బగేల్ కలిబాఫ్
2015 అణు ఒప్పందం పునరుద్ధరణకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇరాన్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీదారులకు ఎలాంటి ఫొటోలు, సమాచారం ఇవ్వమని స్పష్టం చేసింది.
!['తనిఖీదారులకు అణుకేంద్రాల ఫొటోలు ఇవ్వం' Iran, Nuclear deal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11873241-thumbnail-3x2-iran.jpg)
చమురు, బ్యాంకింగ్ రంగాలపై విధించిన ఆంక్షలు తొలగించకపోతే ఫిబ్రవరి తర్వాత అణుకేంద్రాల్లో ఐఏఈఏ అమర్చిన కెమెరాలకు సంబంధించిన ఫొటోలు ఇవ్వమని ఇరాన్ పేర్కొంది. తర్వాత దీన్ని మరో మూడు నెలలు పొడిగించింది. 2015లో ఇరాన్తో అమెరికా, ఇతర దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి 2019లో డొనాల్డ్ ట్రంప్ వైదొలిగారు. ఇరాన్పై కఠిన ఆంక్షలు వింధించారు. ఇప్పుడు.. బైడెన్ ప్రభుత్వం మళ్లీ ఒప్పందంలో చేరేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో 2015 ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ వేగవంతం చేసింది.
ఇదీ చదవండి:'చైనా మారథాన్'లో విషాదం- 21 మంది మృతి