తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఆంక్షల ఒత్తిడికి తలొగ్గిన ఇరాన్​..! - అమెరికాతో చర్చలపై సానుకూలంగా స్పందించారు ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహానీ.

అమెరికాతో చర్చలపై సానుకూలంగా స్పందించారు ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహానీ. అగ్రరాజ్యం ఒత్తిడి పెంచే విధానాలను తక్షణమే కట్టిపెట్టాలని సూచించారు. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అమెరికా ఆంక్షల ఒత్తిడికి తలొగ్గిన ఇరాన్​..!

By

Published : Sep 27, 2019, 7:21 AM IST

Updated : Oct 2, 2019, 4:28 AM IST

ఎట్టకేలకు అమెరికా ఆంక్షల ఒత్తిడికి ఇరాన్​ తలొగ్గింది. అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహానీ సంకేతాలిచ్చారు. ఒత్తిడి పెంచే చర్యలను తక్షణమే ఆపాలని అగ్రరాజ్యానికి సూచించారు.

అణుఒప్పందంపై కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్​పై కఠిన ఆంక్షలను విధిస్తూ వచ్చింది అగ్రరాజ్యం. ఫలితంగా ఇరాన్​ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​- రౌహానీ మధ్య మాటల యుద్ధమూ నడిచింది.

సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన డ్రోన్​ దాడితో ఇరాన్​- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దాడి పని ఇరాన్​దేనని అగ్రరాజ్యం పదేపదే ఆరోపించింది.

అమెరికాతో చర్చలకు సానుకూలంగా స్పందించిన రౌహానీ.. సౌదీ చమురు కర్మాగారాలపై దాడితో.. తమకు సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఆరోపణలు చేసేవారు ఆధారాలు చూపించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:-అమెరికాలో ఇరాన్ అధ్యక్షుడితో మోదీ సమావేశం

Last Updated : Oct 2, 2019, 4:28 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details