తెలంగాణ

telangana

By

Published : May 11, 2021, 1:24 PM IST

ETV Bharat / international

రాకెట్లతో రెచ్చిపోయిన పాలస్తీనా ఉగ్రవాదులు-24 మంది మృతి

ఇజ్రాయెల్​పై రాకెట్​లను ప్రయోగిస్తూ.. రెచ్చిపోతున్నారు పాలస్తీనా ఉగ్రవాదులు. డజన్ల కొద్ది రాకెట్లను మంగళవారం తెల్లవారుజామున వదిలారు. ఈ దాడిలో 24 మంది మరణించారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు.

Gaza
రాకెట్లతో రెచ్చిపోయిన పాలస్తీనా ఉగ్రవాదులు-22 మంది మృతి

ఇజ్రాయెల్​ రాజధాని జెరూసలెంలో ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాలస్తీనా ఉగ్రవాదులు గాజా, ఇజ్రాయెల్ నుంచి డజన్ల కొద్దీ రాకెట్లను మంగళవారం తెల్లవారుజామున ప్రయోగించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. 700 మంది పాలస్తీనీయులు గాయపడ్డారు. 500మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్​ పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇంతేగాక 15 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో మరణించారని చెప్పారు.

ఇస్లాం, జడాయిజం, క్రైస్తవ మతాల వారికి ఏంతో పవిత్ర స్థలమైన జెరూసలెంపై సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవాలని చూడడం వల్ల ఎప్పటిలాగే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. స్థానిక అల్‌-అక్సా మసీదు ప్రాంగణంలో నివాసం ఉంటున్న పాలస్తానీయులు ఇళ్లు ఖాళీ చేయాలని పోలీసులు కోరడం కారణంగా ఇజ్రాయెల్​ పోలీసులకు, పాలస్తీనా వారికి ఘర్షణలు తలెత్తాయి.

రాత్రంతా ఇజ్రాయెల్‌లో డజన్ల కొద్దీ రాకెట్లు లాంఛ్​ చేస్తుండడం వల్ల ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటికే శాంతి స్థాపనకు అమెరికా, యూరప్​ పిలుపునిచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. దీంతో దేనికైనా సిద్ధంగా ఉండాలని నేతన్యాహు సైన్యానికి సూచించినట్లు సమాచారం.

ఇదీ చూడండి:గాజాలో పేలుడు- 20 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details