ఈజిప్ట్ రాజధాని కైరోకు దక్షిణంగా ఉన్న పారోనిక్ నెక్రోపోలిస్లో దాదాపు 100 పురాతన శవపేటికలను ఆ దేశ పురావస్తు అధికారులు కనుగొన్నారు. బయటపడిన శవ పేటికలను తెరిచిన అధికారులు ఎంతో జాగ్రత్తగా సంరక్షించిన మమ్మీలను గుర్తించారు. మమ్మీల గురించి మరింత శోధించేందుకు అధికారులు ఎక్స్రే తీశారు.
ఈజిప్ట్లో బయటపడ్డ 300ఏళ్లనాటి శవపేటికలు - Egypt mummies
ఈజిప్ట్ రాజధాని కైరోలో దాదాపు 100 పురాతన శవపేటికలను అధికారులు కనుగొన్నారు. బయటపడిన మమ్మీలు సుమారు 300 ఏళ్ల క్రితం ఈజిప్ట్ని పరిపాలించిన టోలెమిక్ రాజవంశానికి చెందినవని ఈజిప్ట్ మంత్రి ఖలీద్ ఎల్ అనానీ తెలిపారు.
![ఈజిప్ట్లో బయటపడ్డ 300ఏళ్లనాటి శవపేటికలు Egypt unveils ancient coffins, statues found in Saqqara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9547560-202-9547560-1605397598050.jpg)
ఈజిప్ట్లో బయటపడ్డ 300ఏళ్లనాటి శవపేటికలు
బయటపడిన మమ్మీలు సుమారు 300 ఏళ్ల క్రితం ఈజిప్ట్ని పరిపాలించిన టోలెమిక్ రాజవంశానికి చెందినవని ఆ దేశ పర్యటక, పురావస్తు శాఖ మంత్రి ఖలీద్ ఎల్ అనానీ తెలిపారు. ఈ శవపేటికల్లో కొన్ని మమ్మీలు, 40 వరకు గిల్డెడ్ విగ్రహాలు ఉన్నాయని వెల్లడించారు. వీటన్నింటినీ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల సమీపంలో నిర్మిస్తున్న గ్రాండ్ ఈజిప్టియన్ మ్యూజియంతో పాటు మరో మూడు చోట్ల ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.