తెలంగాణ

telangana

ETV Bharat / international

మోటార్​​ పడవల వినియోగం వద్దంటూ నీటిలో నిరసనలు

ఇటలీ రాజధాని వెనీస్​ నగరంలో ఇంజిన్​తో నడిచే పడవలను ఉపయోగించటం వల్ల కాలుష్యం పెరిగిపోతుందంటూ ప్రజలు నిరసనలు చేపట్టారు. సెయింట్​ మార్క్స్​  స్క్వేర్​ ఎదుట నీటి కొలనులో.. సాధారణ కాలుష్య రహిత పడవలు నడుపుతూ ఆందోళనలు చేశారు.

By

Published : Jan 20, 2020, 11:15 AM IST

Demonstraters in Venice gathered in gondolas  protest against pollution and the use of motor boats
మోటార్​​ పడవల వినియోగం వద్దంటూ నీటిలో నిరసనలు

మోటార్​​ పడవల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ రాజధాని వెనిస్​లో నిరసనలు చేపట్టారు స్థానికులు. వీటి వినియోగం వల్ల రోజురోజుకూ నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పడవలు వేగంగా ఒడ్డుకు రావటం వల్ల ఏర్పడే అలల ధాటికి చారిత్రక కట్టడాలు ధ్వంసమవుతున్నాయని చెబుతున్నారు.

మోటార్​​ పడవల వినియోగం వద్దంటూ నీటిలో నిరసనలు

సెయింట్​ మార్క్స్​ స్క్వేర్​ ఎదుటనున్న ఓ పెద్ద నీటికొలనులో పదుల సంఖ్యలో రోయింగ్​ బోట్లతో శాంతియుతంగా తమ నిరసనలు తెలిపారు. క్రూయిజ్​​ పడవలు ఎక్కువగా వినియోగించటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని ప్లకార్డులను ప్రదర్శించారు.

ఇదీ చూడండి:లక్ష కోట్ల డాలర్లకు 'ఆల్ఫాబెట్' మార్కెట్ విలువ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details