తెలంగాణ

telangana

ETV Bharat / international

సూడాన్​లో కుప్పకూలిన సైనిక విమానం.. 18 మంది బలి - -అమేర్ మహమ్మద్ అల్-హసన్, ప్రతినిధి.

సూడాన్​ పశ్చిమ డర్ఫూర్​ రాష్ట్రం నుంచి బయలుదేరిన సైనిక రవాణా విమానం కొంత సమయం తర్వాత కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా మొత్తం 18 మంది మృతి చెందినట్లు సైనిక ప్రతినిధి తెలిపారు.

children-among-18-killed-in-sudan-military-plane-crash-army
సూడాన్​లో కుప్పకూలిన సైనిక విమానం...18 మంది మృతి

By

Published : Jan 3, 2020, 11:19 PM IST

సూడాన్​ పశ్చిమ డర్ఫూర్​ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశానికి చెందిన సైనిక రవాణా విమానం జనైనా విమానాశ్రయం నుంచి బయలుదేరిన 5 నిమిషాల తర్వాత కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా మొత్తం 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

"జనైనా విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆంటోనోవ్​-12 సైనిక విమానం గురువారం రాత్రి కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు న్యాయమూర్తులు, నలుగురు చిన్నారులతో సహా 8 మంది సిబ్బంది ఉన్నారు."
-అమేర్ మహ్మద్ అల్-హసన్, సైనిక ప్రతినిధి.

కొంతకాలంగా సూడాన్​కు చెందిన చాలా విమానాలు సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణం వల్ల కుప్పకూలినట్లు మహ్మద్​​ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్​లో పేలిన మందుపాతర... జవాన్లకు గాయాలు

ABOUT THE AUTHOR

...view details