టర్కీలో మంచుచరియలు విరిగిపడ్డ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 53 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం వాన్ ప్రావిన్స్లోని బషెసరీ పట్టణ సమీపంలో మంచుచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం 300 మంది సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో మరోసారి మంచుచరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో సహాయక బృందాలకు చెందిన 33 మంది మంచులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు టర్కీ అత్యవసర, విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. వాహనాల్లో ఉన్న మరో ఐదుగురు మరణించినట్లు వెల్లడించింది.