తెలంగాణ

telangana

ETV Bharat / international

యెమెన్​​ సైనిక స్థావరంపై దాడి.. 100 మందికిపైగా మృతి - యెమెన్​​ సైనిక స్థావరంపై క్షిపణి దాడి.. 83మంది మృతి

యెమెన్​లో సైనికులే లక్ష్యంగా డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. దాడి వెనుక హుతీ తిరుగుబాటుదారుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు ఆ దేశ సైన్యాధికారులు.

83 soldiers killed in Yemen missile, drone attack
యెమెన్​​ సైనిక స్థావరంపై క్షిపణి దాడి.. 83మంది మృతి

By

Published : Jan 19, 2020, 7:22 PM IST

Updated : Jan 20, 2020, 4:56 AM IST

యెమెన్​ రాజధాని సనాకు తూర్పున 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ ప్రావిన్స్ మారిబ్‌లోని సైనిక శిబిరంపై శనివారం క్షిపణి, డ్రోను దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. సైనిక శిబిరం మసీదుకు దగ్గరగా ఉండటం, అందులోనూ ప్రార్థనల సమయంలో దాడి చేయడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సైన్యాధికారులు తెలిపారు.

కొద్ది నెలలుగా యెమెన్​లో ఇరాన్​ మద్దతుతో హుతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. సౌదీ అరేబియా సైన్యం సాయంతో స్థానిక ప్రభుత్వం ఆందోళనకారులను అణిచివేస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం సైనిక శిబిరంపై జరిగిన దాడి హుతీ తిరుగుబాటుదారులే చేసి ఉంటారని మిలటరీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే హుతీ మిలీషియా వర్గం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

దాడికి ఒకరోజు ముందు..

ఈ దాడి జరగడానికి ఒక రోజు ముందు ఉత్తర నిహిమ్​ ప్రాంతంలో హుతీలను అణిచివేసేందుకు యెమెన్ ప్రభుత్వం సంకీర్ణ బలగాలను ఉపయోగించింది. ఈ సందర్భంగా డజన్ల కొద్ది హుతీ మిలీషియా సభ్యులు చనిపోయారు. ఆ ఘటన జరిగిన తర్వాత రోజే క్షిపణులను ప్రయోగించడం గమనార్హం.

డ్రోన్​ దాడిని యెమెన్ అధ్యక్షుడు అబేద్రాబ్బో మన్సూర్ తీవ్రంగా ఖండించారు.

" ఇది తప్పకుండా హుతీ తిరుగుబాటుదారుల పనే. విధ్వంసం తప్ప వారికి ఏమీ తెలియదు. హుతీ మిలీషియా సభ్యులు ఇరాన్​ చేతిలో కీలుబొమ్మలు."

అబేద్రాబ్బో మన్సూర్, యెమెన్ అధ్యక్షుడు

Last Updated : Jan 20, 2020, 4:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details