తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2020, 7:00 AM IST

Updated : Jan 3, 2020, 9:32 AM IST

ETV Bharat / international

బాగ్దాద్​ విమానాశ్రయంపై రాకెట్​ దాడి-8మంది మృతి

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​ దద్దరిల్లింది. విమానాశ్రయంపై రాకెట్​ దాడి జరగడం వల్ల 8మంది మృతిచెందారు. ఇరాన్​ నిఘా విభాగాధిపతి ఖాసీం సోలెమెన్​​ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్​ మీడియా వర్గాలు వెల్లడించాయి.

iraqi
బగ్దాద్​ విమానాశ్రయంపై రాకెట్​ దాడి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు.ఇరాన్‌ నిఘా విభాగాధిపతి ఖాసీం సోలెమన్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విమానాశ్రయ కార్గో హాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు ఇరాక్‌ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు.

బగ్దాద్​ విమానాశ్రయంపై రాకెట్​ దాడి

అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి జరిగిన కొద్ది రోజుల అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్​ ఉద్యమకారులకు మద్దతుగా ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లో గత నెల 31న ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే​ బాగ్దాద్​లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి చేశారు ఆందోళనకారులు.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధానికి 'కార్చిచ్చు' సెగ- బాధితుల ఆగ్రహం

Last Updated : Jan 3, 2020, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details