తాలిబన్లపై అఫ్గానిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 50 మంది హతమయ్యారు. హెల్మండ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దాడులు జరిపినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని లష్కర్ఘా, గరాంసిర్, నావా జిల్లాల్లోని తాలిబన్లు తలదాచుకునే ప్రాంతాలను గుర్తించామని తెలిపింది.
సాయుధుల్లో 50 మందిని హతమార్చామని, 8 మంది గాయపడ్డారని స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించిన వివరాలను అఫ్గాన్ సైన్యాధికారి నవాబ్ షా జాద్రాన్ వెల్లడించారు. నావా, నాద్ అలీ, గరాంసిర్ జిల్లాలు సహా రాష్ట్ర రాజధాని అయిన లష్కర్ఘాలో శుక్రవారం రాత్రి దాడులు జరిపామన్నారు.