తెలంగాణ

telangana

ETV Bharat / international

జైలు నుంచి తప్పించుకొని మృత్యు ఒడిలోకి.. - లెబనాన్​ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు

లెబనాన్​లో ఓ జైలు నుంచి తప్పించుకున్న ఐదుగురు నేరస్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వారి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ఖైదీలు అక్కడికక్కడే మరణించారు.

5-escaped-prisoners-killed-in-car-crash-in-lebanon
జైలునుంచి తప్పించుకుని మృత్యువు ఒడిలోకి

By

Published : Nov 21, 2020, 8:50 PM IST

లెబనాన్​ రాజధాని బీరుట్​లోని బాబ్దా జైలును శనివారం దాదాపు 70మంది క్రిమినల్స్​ ధ్వంసం చేసి పరారయ్యారు. ఐదుగురు ఖైదీలు ఓ కారును దొంగిలించి అందులో తప్పించుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వారి కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు నేరస్థులు అక్కడికక్కడే మరణించారు. పరారైనవారిలో ఇప్పటివరకు 15మందిని మళ్లీ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో నలుగురు లొంగిపోయారని వివరించారు.

మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది
పూర్తిగా ధ్వంసం అయిన కారు

జైలు సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు భద్రతాబలగాలు తెలిపాయి. సమీప ప్రాంతాన్ని సీల్ చేసినట్లు వివరించాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details