తెలంగాణ

telangana

ఇరాక్​: అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్​ దాడులు!

By

Published : Jun 19, 2020, 5:19 AM IST

ఇరాక్​లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా 4 రాకెట్లతో దాడులు జరిగాయి. ఇరాక్​తో అమెరికా చర్చలు జరుపుతున్న క్రమంలో దాడులు జరగటం ఇది మూడోసారి.

4 rockets hit Baghdad's Green Zone
అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్​ దాడులు!

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా రాకెట్​ దాడులు జరిగాయి. బాగ్దాద్​లోని అత్యధిక భద్రత కలిగిన గ్రీన్​ జోన్​లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో నాలుగు రాకెట్లతో దాడులు జరిగినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఇరాక్​ కొత్త ప్రభుత్వంతో అమెరికా వ్యూహాత్మక చర్చలు జరుపుతున్న క్రమంలో రాకెట్​ దాడులు జరగటం ఇది మూడోసారి అని పేర్కొన్నాయి.

ఈ దాడులకు ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు.. కానీ ఇరాన్​ మద్దతున్న పారామిలిటరీ దళాలే ఈ దాడికి ఒడిగట్టినట్లు అమెరికా ఆరోపించింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.

అమెరికా బలగాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఇరాక్​ ప్రధాని ముస్తఫా అల్​ కధిమి ప్రభుత్వానికి తాజా రాకెట్​ దాడులు సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరిస్తూ ట్వీట్​ చేశారు కధిమి.

" ఈ దాడులు మా స్థిరత్వాన్ని, భవిష్యత్తును అణగదొక్కాలని లక్ష్యంగా చేసుకుని చేశారు. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. గందరగోళాన్ని సృష్టించేందుకు చూస్తున్న వారిని సహించేది లేదు. "

- ముస్తఫా అల్​ కధిమి, ఇరాక్​ ప్రధానమంత్రి.

అమెరికా-ఇరాక్​ మధ్య తొలి దశ చర్చలు గత వారం ప్రారంభమయ్యాయి. ఇరాక్​లో అగ్రరాజ్య బలగాలు, ఇరాక్​ వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న పారామిలిటరీ గ్రూప్​ల చర్యలు, దేశ ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా బలగాలపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది ఇరాక్​.

ABOUT THE AUTHOR

...view details