తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాక్​లో రాకెట్​ దాడులు.. ఐదుగురు మృతి

ఇరాక్​లో సోమవారం జరిగిన రాకెట్​ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

By

Published : Sep 29, 2020, 9:07 AM IST

3 children, 2 women killed in rocket attack near Iraq's Baghdad airport
ఇరాక్​ రాకెట్​ దాడుల్లో ఐదుగురు మృతి

ఇరాక్​ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ ఇంటిపై రెండు రాకెట్లు​ కూలగా.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు ఇరాక్ మిలటరీ తెలిపింది. అల్బు అమీర్​ ప్రాంతంలో మరో రాకెట్​ దాడి జరగ్గా.. ఇద్దరు చిన్నారులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి అల్​ జిహాద్​కు చెందిన ముఠాలు కారణమని అనుమానిస్తున్నారు. దాడులకు గల కారకులను వెంటనే అరెస్టు చేయాలని, అలాగే పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు ఆ దేశ ప్రధాని ముస్తఫా అల్-ఖాదిమి.

బాగ్దాద్ విమానాశ్రయంతో పాటు ఇరాక్ అంతటా యూఎస్ దళాల సైనిక స్థావరాలు ఉన్న నేపథ్యంలో అవే లక్ష్యంగా మోర్టార్, రాకెట్ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరాక్​ ప్రభుత్వం కనుక ఇటువంటి చర్యలను నియంత్రించకపోతే ఆ దేశంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేయనున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పాంపియో హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details