తెలంగాణ

telangana

ETV Bharat / international

పార్టీగేట్​ వ్యవహారం.. జరిమానా చెల్లించిన బ్రిటిష్​ ప్రధాని - మే 20న గార్డెన్‌ పార్టీ

Boris Johnson Pays PartyGate Fine: కఠినమైన కొవిడ్​ లాక్​డౌన్ అమలు ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా విందులు జరుపుకున్నందుకు తమకు విధించిన జరిమానాను చెల్లించినట్లు బ్రిటిష్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ దంపతులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రజలందరికీ క్షమాపణలు కోరారు.

uk-pm-boris-johnson-
uk-pm-boris-johnson-

By

Published : Apr 13, 2022, 4:51 AM IST

Boris Johnson Pays PartyGate Fine: 2020 సంవత్సరంలో కఠినమైన కొవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి విందుల్లో పాల్గొన్నందుకుగాను తమపై స్కాట్లాండ్ యార్డ్​ విధించిన జరిమానాను చెల్లించినట్లు మీడియాకు బ్రిటిష్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు చెప్పారు. అంతకుముందు బోరిస్​ భార్య క్యారీ జాన్సన్ కూడా జరిమానా చెల్లించినట్లు తెలియజేశారు.

2020-21 కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్‌ స్ట్రీట్‌, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలను ఇష్టానుసారం ఉల్లంఘించారంటూ 'పార్టీ గేట్‌' కుంభకోణం పేరిట ఒక్కొక్క విషయాలు బయటపడ్డాయి. కొవిడ్‌ ఆంక్షలు కఠినంగా అమలులో ఉన్న 2020 మే 20న గార్డెన్‌ పార్టీ, జూన్‌ 19న బోరిస్‌ జన్మదిన వేడుకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారాలపై నిజానిజాలు తేల్చేందుకు లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో బోరిస్‌తో పాటు ఆ పార్టీలో పాల్గొన్న ఆర్థిక మంత్రి సునక్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని విపరీతంగా డిమాండ్​లు వచ్చాయి.

అయితే, తన మీద ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా రాజీనామా చేయను గాక.. చేయనంటూ జాన్సన్‌ గతంలోనే స్పష్టం చేశారు. తాజాగా రాజీనామా డిమాండ్​లపై మరోసారి స్పందించిన బోరిస్​.. దేశ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని.. ఇప్పుడు తాను అదే చేస్తున్నానని తేల్చి చెప్పారు. బోరిస్​ దంపతులు ఎంత మొత్తంలో జరిమానా విధించారనేది తెలియాల్సి ఉంది. ఒక్కొక్కరికి 200 పౌండ్లు జరిమానా విధించి ఉంటారని అంతా భావిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు జరిమానా పడిన బ్రిటన్‌ మొదటి ప్రధాన మంత్రి జాన్సనే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: లక్ష్యం చేరేదాక యుద్ధం ఆగదు: పుతిన్​

ABOUT THE AUTHOR

...view details