తెలంగాణ

telangana

ETV Bharat / international

థాయ్​లాండ్​లోనూ అయోధ్య- రాజులకు శ్రీరాముని పేరు- యునెస్కో గుర్తింపు

Thailand Ayutthaya Temple : ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలాగే.. మరో దేశంలోనూ అయోధ్య ఉంది. ఇక్కడ రామాయణంలాగే.. అక్కడా ఓ మహా గ్రంథం వెలువడింది. రామాయణంలో రాముడు, రావాణాసురుడిలాగే .. అందులోనూ విభిన్న పాత్రలున్నాయి. ఆ ప్రదేశానికి అయోధ్యకు కొన్ని దగ్గరి పోలికలున్నాయి. మరి అదేప్రాంతం? ఆ మహా గ్రంథం పేరేంటి? ఈ రెండు అయోధ్య నగరాలకు ఉన్న దగ్గరి పోలికలేంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 7:23 AM IST

Updated : Dec 1, 2023, 10:15 AM IST

Thailand Ayutthaya Temple
Thailand Ayutthaya Temple

థాయ్​లాండ్​లోనూ అయోధ్య- రాజులకు శ్రీరాముని పేరు- యునెస్కో గుర్తింపు

Thailand Ayutthaya Temple : థాయ్​లాండ్‌లోని అయుతయ ప్రాంతాన్ని అయోధ్యగా పిలుస్తారు. ఈ ప్రదేశానికి అయోధ్య అని పేరు పెట్టడమే కాదు.. చరిత్రలో కూడా ఈ రెండు ప్రదేశాల మధ్య కొన్ని దగ్గరి పోలికలున్నాయి. అయుతయ రాజవంశంలోని ప్రతి రాజునూ శ్రీరాముని అవతారంగా కొలుస్తారు. రాజుల పేరులో రామ అనే పదాన్ని చేర్చుకోవడం ఇక్కడి తరతరాల సంప్రదాయం. రామాయణంలో అయోధ్య రాముని రాజధానిగా పేర్కొన్నారు. అయితే సయామీ పాలకుల కాలంలో అయుతయాని కూడా రాజధానిగా ప్రస్తావించారు.

థాయ్​లాండ్​లోని అయోధ్య

క్రీస్తు శకం 1351 నుంచి సయామీ పాలకుల రాజధానిగా ఉన్న అయుతయను.. 1767లో బర్మా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. హిందూ ఇతిహాసాల్లోని రామాయణంలాగే థాయ్‌లాండ్‌ రామాయణం పేరు రామకియాన్‌. దీన్ని 18వ శతాబ్దంలో.. కింగ్‌ రామ ఒన్ రచించారని నమ్ముతారు. ఈ గ్రంథం గురించి 300 రామాయణం అనే పుస్తకంలో వాల్మీకి రాసిన రామాయణంతో పోల్చారు. రామాయాణంలోని రావాణాసురుడిలాగే ఈ పుస్తకంలోని ప్రత్యర్థి పేరు థోత్సకన్‌. మనం శ్రీరామ్‌గా ఆరాధించే పేరును థాయ్‌ వాసులు ఫ్రారామ్‌గా ఆరాధిస్తారు. ప్రస్తుతం అయుతయ నగరాన్ని యునెస్కో గుర్తించి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.

అయుతయాలోని బుద్ధుని విగ్రహం

థాయ్​లాండ్​లో ఉన్న అయోధ్య గురించి వివరించారు అక్కడ 22 ఏళ్లుగా ఓ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ సురేశ్ పాల్​ గిరి. థాయ్​లాండ్​లో గత కొద్దికాలంగా బౌద్ధ మతంలోని ఆచారాలు హిందూ మతంలోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. 'భారత్​లోని అయోధ్య, థాయ్‌లాండ్‌లోని అయోధ్య మధ్య సారూప్యత ఉంది. భారతీయులు సంప్రదాయాలను, సంస్కృతిని మరిచిపోలేదు. అలాగే తరతరాలుగా శ్రీరాముడిని నమ్ముతున్నారు. అదే విధంగా థాయ్‌లాండ్‌లో కూడా శ్రీరాముడ్ని ఆరాధిస్తున్నారు. ఇక్కడ రాజు ఆయుతయ నగరంలో నగరానికి 35 కి.మీ దూరంలో విష్ణువు, బ్రహ్మ, శివుని ఆలయాలను నిర్మించారు.' అని సురేశ్ పాల్​ గిరి చెప్పారు.

Ayodhya Ram Mandir Opening Date : భారత్​లో అయోధ్య రామమందిర ప్రాణపతిష్ఠ వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు.

Last Updated : Dec 1, 2023, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details