Single Malt Auction : ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోథెబి లండన్లో నిర్వహించిన వేలంలో మెకలాన్ కంపెనీ తయారు చేసిన సింగిల్ మాల్ట్ విస్కీ రూ. 22 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. 2019లో ఇదే కంపెనీ తయారు చేసిన విస్కీ రూ. 15 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ వేలంలో తన పేరు మీద ఉన్న ఆ రికార్డును మెకలాన్ కంపెనీ తిరగ రాసింది. ఈ నెల 18న జరిగిన వేలంలో దీని ధర రూ. 12 కోట్లు పలుకుతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా రూ. 22 కోట్లకు ఈ పురాతన విస్కీ బాటిల్ అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
1926లో 40 బాటిళ్ల విస్కీ తయారీ
Rare Single Malt Whisky Auction : మెకలాన్ కంపెనీ 1926లో ఈ విస్కీని తయారు చేసి.. 60 ఏళ్లు నిలవ చేసింది. దానిని 1986లో 40 బాటిళ్లలో నింపింది. కానీ ఈ కంపెనీ వీటన్నింటిని అమ్మకానికి ఉంచలేదు. కొన్నింటిని మెకలాన్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. ప్రతి ఒక్క వేలందారు ఇటవంటి విస్కీని విక్రయించాలని కోరుకుంటారని.. అలాగే ప్రతి ఒక్క కొనుగోలుదారు దీనిని సొంతం చేసుకోవాలనుకుంటారని వేలం నిర్వహించిన సోథెబి సంస్థ నిర్వాహకులు తెలిపారు.