shootings in us 2022: అమెరికాలో మరోమారు తుపాకుల మోత మోగిపోయింది. వారాంతంలో చికాగోలోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు వెలుగుచూశాయి. ఇందులో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. 16 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. గత శుక్రవారం సాయంత్రం తొలిసారి ఎన్బీసీ చికాగోలోని సౌత్ కిల్పట్రిక్ ప్రాంతంలో తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఓ 69 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.
నగరంలోని బ్రిఘ్టోన్ పార్క్, సౌత్ ఇండియానా, నార్త్ కెడ్జీ అవెన్యూ, హంబొల్డ్ పార్క్ సహా ఇతర ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు జరిగినట్లు మీడియా తెలిపింది. ఈ ఘటనల్లో చిన్న పిల్లల నుంచి 62 ఏళ్ల మహిళ వరకు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. మరో మీడియా 8 మంది మరణించగా.. 42 మంది గాయపడినట్లు తెలిపింది.