తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2022, 8:42 PM IST

ETV Bharat / international

మోదీకి పాక్​ ప్రధాని షెహబాజ్​ లేఖ.. కశ్మీర్​పై కీలక వ్యాఖ్యలు!

Shahbaz Sharif letter: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్​ షరీఫ్ లేఖ రాశారు. ఈ లేఖలో భారత్​తో పాక్ శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటోందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని షెహబాజ్‌ పేర్కొన్నారు.

Shehbaz Sharif letter
పాకిస్థాన్ ప్రధాని మోదీకి లేఖ

Shahbaz Sharif letter: భారత్‌తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్‌ సహా అపరిష్క్రత సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పాక్‌ నూతన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ పంపారు. సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని షెహబాజ్‌ పేర్కొన్నారు.

ఇటీవల పాక్‌ నూతన ప్రధానికి లేఖ రాసిన ప్రధాని మోదీ, అభినందనలతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చర్చల కోసం ఉగ్రవాద రహిత వాతావరణాన్ని సృష్టించడం గురించి.. ఈ లేఖలో ప్రధాని ప్రస్తావించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రధాని లేఖకు బదులిచ్చిన పాక్‌ ప్రధాని తాము కూడా శాంతియుత సహకారాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు.

"శుభాకాంక్షలు తెలిపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. భారత్​తో పాకిస్థాన్ శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్‌తో సహా ఇతర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం అనివార్యం. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ త్యాగం అందరికీ తెలిసిందే. శాంతిని కాపాడుకుందాం. సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడదాం"

-షెహబాజ్​ షరీఫ్, పాకిస్థాన్ ప్రధానమంత్రి

పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ యుద్ధ విమానాలు దాడులు తరువాత భారత్, పాక్​ల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. పాకిస్థాన్‌తో సాధారణమైన పొరుగుదేశాల సంబంధాలను భారత్ కోరుకుంటుందని, హింస లేని వాతావరణంలో ద్వైపాక్షికంగా, శాంతియుతంగా సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. పాకిస్థాన్‌తో భారత్ నిర్మాణాత్మక సంబంధాలను భారత్ కోరుకుంటోందని ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం అన్నారు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని భారత్​ కోరుకుంటుందని పేర్కొన్నారు.

"పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు హెచ్.ఈ.మియాన్ ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని భారత్​ ఎల్లప్పుడూ కోరుకుంటోంది. అప్పుడే అభివృద్ధి, సవాళ్లపై ఇరుదేశాలు దృష్టి సారించగలవు"

-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

ఇదీ చదవండి:బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్​ ధర ఒకేసారి రూ.84 పెంపు.. ఎక్కడంటే...

ABOUT THE AUTHOR

...view details