PM Modi Japan tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి దిల్లీ నుంచి బయల్దేరిన ఆయన.. సోమవారం ఉదయం టోక్యోలో అడుగుపెట్టారు. ఈ మేరకు జపనీస్, ఇంగ్లిష్ భాషల్లో ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు జపాన్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్లొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని మోదీ వివిధ దేశాల అధినేతలతో పాటు వ్యాపారవేత్తలు, భారత సంతతికి చెందిన ప్రజలతోనూ సమావేశం కానున్నారు. దాదాపు 40 గంటల పాటు ఆయన జపాన్లో ఉంటారు. ఆ సమయంలో 23 కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది.