తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2022, 8:17 PM IST

ETV Bharat / international

పెట్రోల్ ట్యాంకర్​ పేలుడు.. 12 మంది మృతి.. ఏడుగురికి గాయాలు..

నైజీరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.

petrol tanker explosion in nigeria
నైజీరియాలో భారీ పేలుడు

నైజీరియాలోని అబుజాలో భారీ పేలుడు సంభవించింది. పెట్రోలు ట్యాంకర్ బ్రేక్​లు ఫెయిలై హైవేపై వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో పేలుడు సంభవించింది. ఆ సమయంలో రోడ్డుపై వస్తున్న కార్లు, వాహనాల్లో ఉన్న 12 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిందీ ఘటన. పెట్రోల్ ట్యాంకర్​ బ్రేక్​లు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details