తెలంగాణ

telangana

ETV Bharat / international

Pakistan Beggar Mafia : అడుక్కునేందుకు సౌదీకి వెళ్తున్న పాకిస్థానీలు అరెస్ట్.. 'విదేశాల్లో 90% బిచ్చగాళ్లు వారే!'

Pakistan Beggar Mafia : పాకిస్థాన్​కు చెందిన 16 మంది బిచ్చగాళ్లను అరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. వీరంతా భిక్షాటన కోసం సౌదీ అరేబియాకు వెళ్తుండగా.. విమానంలో పట్టుకున్నారు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ అధికారులు.

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 3:50 PM IST

Pakistan Beggar Mafia
Pakistan Beggar Mafia

Pakistan Beggar Mafia :భిక్షాటన చేసేందుకు విదేశాలకు వెళ్తున్న 16 మంది పాకిస్థానీలనుఅరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. సౌదీ అరేబియా వెళ్తున్న వీరిని పంజాబ్​​ ప్రావిన్స్​లోని ముల్తాన్​లో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వీరిని రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా వెళ్తున్న విమానంలో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ తెలిపింది. వీరిలో 11 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నట్లు పేర్కొంది. వీరంతా ఉమ్రా వీసాలపై సౌదీకి వెళ్తున్నట్లు చెప్పింది. ఈ వీసాలను మక్కాకు వెళ్లే ముస్లింలకు ఇస్తారు. ఈ వీసా ఉన్న వాళ్లు ఏడాదిలో ఎప్పుడైనా మక్కాకు వెళ్లవచ్చు.

Pakistan Beggars News : వీరిని అరెస్ట్ చేసిన తర్వాత విచారించగా.. తాము భిక్షాటన చేసేందుకే సౌదీకి వెళ్తున్నట్లు వారు అంగీకరించారు. అక్కడ భిక్షాటన చేసి సంపాదించిన మొత్తంలో సగం నగదు.. ప్రయాణ ఏర్పాట్లు చేసిన ఏజెంట్లకు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ఉమ్రా వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి పాకిస్థాన్​కు వస్తామని చెప్పారు. వీరిపై చర్యలు తీసుకుంటామని FIA అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాలకు పాకిస్థాన్​ బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తోందన్న అక్కడి ప్రభుత్వ ప్రకటించిన రోజుల్లోనే ఈ ఘటన వెలుగు చూసింది.

'విదేశాల్లో బిచ్చగాళ్లంతా పాకిస్థానీలే'
Pakistan Begging Mafia : అంతకుముందు విదేశాల్లో ఉన్న పాకిస్థానీలకు సంబంధించి అక్కడి సెనెట్‌లో చర్చ జరిగింది. విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ దీనిపై చర్చించింది. పాకిస్థాన్‌కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి జుల్ఫికర్‌ హైదర్‌ కమిటీకి వివరించారు. విదేశాల్లో అరెస్టవుతోన్న బిచ్చగాళ్లలో 90శాతం మంది తమ దేశానికి చెందినవారే ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌కు వెళ్లేందుకు యాత్రికుల వీసాను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా పవిత్ర స్థలాల్లో అరెస్టవుతోన్న జేబు దొంగల్లోనూ మెజార్టీ సంఖ్య పాక్‌ జాతీయులదేనని తెలిపారు. పాక్‌ జేబు దొంగలకు ఇప్పటివరకు పశ్చిమాసియా దేశాలే గమ్యంగా ఉండగా.. అటువంటి వారికి ఇప్పుడు జపాన్‌ కొత్త గమ్యస్థానంగా మారుతోందన్నారు.

పాక్‌ విదేశీ మారకాన్ని పెంచుకోవాలంటే నైపుణ్యం కలిగిన కార్మికులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం జుల్ఫికర్‌ హైదర్‌ చెప్పారు. నైపుణ్యం లేని వారితో పోలిస్తే నైపుణ్యం కలిగిన కార్మికులకే సౌదీ అరేబియా ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో 50వేల మంది ఇంజినీర్లు నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. భారత్‌ చంద్రుడిని చేరుకుంటే.. పాకిస్థాన్‌ మాత్రం ప్రతిరోజు పొరపాట్లు చేస్తూనే ఉందని పేర్కొన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం, సౌదీ అరేబియాలో దాదాపు 30 లక్షల మంది, యూఏఈలో 15లక్షల మంది, ఖతర్‌లో 2లక్షల మంది పాకిస్థానీలు ఉన్నారని అంచనా. ఇటీవల తమ దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న యాచకుల సంఖ్య భారీగానే ఉందని.. మానవ అక్రమ రవాణాను ఇది మరింత ప్రోత్సహిస్తుందని తాజా నివేదిక వివరించింది. అయితే, ఇలా వస్తోన్న వారిని కట్టడి చేయాలని సౌదీ అరేబియా, ఇరాక్‌ వంటి దేశాలు పాకిస్థాన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

POK Protest Against Pakistan : 'POKను పాకిస్థాన్​ ఖాళీ చేయాల్సిందే'.. ఐరాస వద్ద కశ్మీర్‌ ప్రజల నిరసన!

Nawaz Sharif About Pakistan Situation : 'భారత్‌ చంద్రుడిని చేరుకుంటే.. పాక్​ మాత్రం​ ప్రపంచాన్ని అడుక్కుంటోంది'

ABOUT THE AUTHOR

...view details