తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2022, 11:39 AM IST

Updated : Oct 13, 2022, 2:23 PM IST

ETV Bharat / international

వరద నుంచి బయటపడినా వీడని మృత్యువు.. బస్సులో 18 మంది సజీవదహనం

పాకిస్థాన్​లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఇందులో 18 మంది సజీవదహనమవ్వగా మరో 10 మంది గాయాలపాలయ్యారు. వీరందరూ పాక్​ వరద బాధితులు కావడం గమనార్హం.

pakistan bus accident
bus accident in pakistan

పాకిస్థాన్‌లో బుధవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. మంటలు అంటుకోవడం వల్ల బస్సులో ఉన్న దాదాపు 18 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్‌ వే వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికులంతా ఇటీవల పాక్‌ను ముంచెత్తిన వరద బాధితులు కావడం గమనార్హం.

"ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా వరద బాధితులే. విపత్తు సమయంలో వారికి మోటార్‌ వే సమీపంలో ఆశ్రయం కల్పించారు. తిరిగి వారంతా తమ సొంత జిల్లా దాదుకు వెళుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. వెనక భాగంలో అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించడంతో.. అనేక మంది సజీవదహనమయ్యారు. ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు బస్సు నుంచి దూకేశారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు" అని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

ఇటీవల పాకిస్థాన్‌ భారీ వరదలతో విలవిల్లాడింది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కురిసిన వర్షాలతో దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. అందులో సింధ్‌ ప్రావిన్స్‌లోని దాదూ జిల్లా కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. ఈ ఆగస్టులో కూడా పాక్‌లో పంజాబ్‌ రాష్ట్రంలో ఈ తరహా ప్రమాదం జరిగింది. ఆయిల్‌ ట్యాంకర్‌, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవదహనమయ్యారు.

ఇదీ చదవండి:రష్యాకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. ఓటింగ్​కు భారత్ దూరం

పాపం.. ఒకేసారి 477 తిమింగలాలు మృతి

Last Updated : Oct 13, 2022, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details