తెలంగాణ

telangana

By

Published : Oct 28, 2022, 7:17 AM IST

ETV Bharat / international

కర్బన ఉద్గారాల కట్టడిలో భారత్‌ భేష్‌.. ఐరాస నివేదిక

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ధనిక దేశాలు చెబుతున్న మాటలకు వాటి ఆచరణకు ఏ మాత్రం పొంతనలేదని మరోసారి రుజువైంది. కర్బన ఉద్గారాల విడుదల ధనిక దేశాల్లోనే అధికంగా ఉంటోందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ నివేదిక నివేదిక స్పష్టం చేసింది. జీ20 దేశాల సగటులోనూ భారత్‌లో కర్బన ఉద్గారాల విడుదల సగమేనని ఐరాస నివేదిక పేర్కొంది.

carbon emissions in india
భారత్‌లో కర్బన ఉద్గారాలు

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ధనిక దేశాలు చెబుతున్న మాటలకు వాటి ఆచరణకు ఏ మాత్రం పొంతనలేదని మరోసారి రుజువైంది. భూతాపానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాల(గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌) విడుదల ఆ దేశాల్లోనే అత్యధికంగా ఉంటోందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) పర్యావరణ కార్యక్రమ నివేదిక స్పష్టం చేసింది. 2020లో కర్బన ఉద్గారాల ప్రపంచ తలసరి 6.3 టన్నులు(కార్బన్‌ డైఆక్సైడ్‌ ఈక్వలెంట్‌)కాగా భారత్‌ సగటు 2.4 టన్నులు మాత్రమేనని వెల్లడించింది. జీ20 దేశాల సగటులోనూ భారత్‌లో కర్బన ఉద్గారాల విడుదల సగమేనని ఐరాస నివేదిక పేర్కొంది.

వచ్చే నెలలో ఈజిప్టులో జరగబోతున్న ఐరాస పర్యావరణ సదస్సు(కాప్‌27)ను పురస్కరించుకుని 'ఎమిషన్స్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ 2022: క్లోజింగ్‌ విండో' పేరుతో గురువారం ఓ నివేదిక విడుదలైంది. భూతాపాన్ని గణనీయంగా తగ్గించుకోవాలన్న ఉమ్మడి లక్ష్యంతో ప్రపంచ దేశాలు 2015లో పారిస్‌ ఒప్పందంపై అవగాహనకు వచ్చాయి. ఈ శతాబ్దం చివరికి భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌ కన్నా మరింత తగ్గించుకోవాలని ప్రతినబూనాయి. పారిశ్రామికయుగానికి ముందునాటితో పోలిస్తే ఈ పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి ప్రయత్నించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

వేగంగా శుద్ధ ఇంధనాలకు మళ్లాలి: ఐఈఏ
ప్రపంచవ్యాప్తంగా మండిపోతున్న చమురు,గ్యాస్‌ ధరలు, ఆర్థిక మాంద్యం, ఉక్రెయిన్‌ యుద్ధం తదితర పరిస్థితులు శుద్ధ ఇంధనాల వినియోగ ఆవశ్యకతను వేగిరం చేస్తున్నాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలిపింది. బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలకు అంతర్జాతీయంగా గిరాకీ మరికొన్ని దశాబ్దాలు కొనసాగవచ్చని గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో అభిప్రాయపడింది. మరి కొన్నేళ్లలో బొగ్గు వినియోగం, ఈ దశాబ్దం చివరికి సహజవాయువు వినియోగం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయని, వివిధ దేశాల విధానాలను పరిశీలించిన మీదట ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. విద్యుత్‌ కార్ల వినియోగం అధికం కావడం వల్ల 2030 తర్వాత డీజిలు, పెట్రోలు వినియోగం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది.

ఇవీ చదవండి:ఇంటి పని చేయాలని భార్యకు చెప్పడం క్రూరత్వం కాదు: హైకోర్టు

బిడ్డను ఒంటికి కట్టుకుని.. ఆటో నడుపుతూ..'ఆమె' బతుకు పోరాటం

ABOUT THE AUTHOR

...view details