China Plane Crash: ఇటీవల జరిగిన చైనా విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న 132 మంది మృతిచెందినట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో సోమవారం కూలిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత.. అనేక గంటలు గాలింపు చేపట్టినా.. ఎలాంటి ఆశాజనక పరిస్థితులు కన్పించలేదు. ఈ ఘటనపై దర్యాప్తులో చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ తెలిపింది.
ఆ విమాన ప్రమాదంలో 132 మంది మృతి.. మరో బ్లాక్ బాక్స్ లభ్యం - చైనా విమాన ప్రమాదం వార్తలు
China Plane Crash: చైనా విమాన ప్రమాదంలో 132 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా ధ్రువీకరించింది. 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో సోమవారం కూలిపోయింది. మరోవైపు, ఈ విమానానికి సంబంధించిన రెండో బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
![ఆ విమాన ప్రమాదంలో 132 మంది మృతి.. మరో బ్లాక్ బాక్స్ లభ్యం China Plane Crash](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14847465-thumbnail-3x2-ms.jpg)
China Plane Crash
మరోవైపు, ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. నాలుగు రోజుల క్రితమే కాక్పిట్ వాయిస్ రికార్డర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఫ్లైట్ డేటా రికార్డర్ను సైతం గుర్తించారు. ఈ రెండింటి సాయంతో ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. వీటిని విశ్లేషించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటారు.
ఇదీ చూడండి:ఉక్రెయిన్పై ఆగని దాడులు.. 16,400 మంది రష్యా సైనికులు మృతి!
Last Updated : Mar 27, 2022, 9:49 AM IST