తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కాలంలో పార్లమెంట్​ సమావేశం ఇలా...

కరోనా సంక్షోభం ఆరంభమైన తర్వాత... తొలిసారిగా జర్మనీ నార్త్​ రైన్​ వెస్ట్‌ఫాలియన్​ రాష్ట్రం పార్లమెంట్​ సమావేశం నిర్వహించింది. ప్రత్యేకమైన గాజుతో తయారు చేసిన పెట్టెల్లో చట్టసభ్యులు భేటీ అయ్యారు. వైరస్​ భయంతోనే ఈ వినూత్న ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

By

Published : Jun 24, 2020, 7:29 PM IST

with the lawmakers separated by acrylic glass boxes in the Parliament session in Germany
గాజు పెట్టెల్లో పార్లమెంట్​ సమావేశాలు

ప్రపంచ దేశాలు కరోనా సంక్షోభంతో అతలాకుతలం అవుతున్నాయి. వైరస్​ భయాలను వీడి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీలోని ఓ రాష్ట్రం వినూత్నంగా పార్లమెంట్​ సమావేశం నిర్వహించింది.

జర్మనీలో కరోనా వైరస్​ సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారిగా నార్త్​ రైన్​ వెస్ట్‌ఫాలియన్​ రాష్ట్రంలోని డ్యూసెల్డార్ఫ్‌లో పార్లమెంట్​ సమావేశం నిర్వహించారు. చట్ట సభ్యులు పక్కపక్క కుర్చీల్లోనే కూర్చున్నా భౌతికదూరం పాటించేలా ప్రత్యేకమైన యాక్రిలిక్ గాజు క్యాబిన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 240మంది చట్ట సభ్యులు 240 అద్దాల పెట్టెల మధ్య కూర్చుని వేర్వేరు అంశాలపై చర్చించారు.

జర్మనీ నార్త్​ రైన్​ వెస్ట్‌ఫాలియన్​ రాష్ట్ర పార్లమెంట్
అద్దాల క్యాబిన్​లలో పార్లమెంట్​ సమావేశం
పార్లమెంట్​కు హాజరైన సభ్యులు
పార్లమెంట్​ సమావేశంలో పాల్లొన్న ప్రజాప్రతినిధులు
గాజు పెట్టెల్లో పార్లమెంట్​ సమావేశం

ఇదీ చూడండి:ప్రధానికి షాక్- ప్రతిపక్ష పార్టీలోకి తమ్ముడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details