కరోనా కట్టడికి భారత్ చేపడుతున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. కొవిడ్-19ను గుర్తించడంలో వ్యాధినిర్ధరణ సౌకర్యాలను అభివృద్ధి చేసుకోవడాన్ని అభినందించింది.
భారత్కు జనాభానే అతిపెద్ద సవాల్ అన పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ. భౌగోళిక భిన్నత్వం కారణంగా కరోనా లాంటి మహమ్మారులు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. దేశంలో లాక్డౌన్ను ఒక క్రమపద్దతిలో ప్రవేశట్టారని... ప్రస్తుతం అమల్లో ఉన్న అన్లాక్ కూడా వ్యవస్థీకృతంగా ఉంది కొనియాడింది. ఇదే విధానాన్ని భారత్ సహా అనేక ప్రపంచ దేశాలు దీర్ఘకాలంలో కరోనా కట్టడికి పాటించాలంది.