తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2020, 12:34 PM IST

ETV Bharat / international

భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు ఆందోళనకరం: బోరిస్​

సరిహద్దు వివాదంపై తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అత్యంత ఆందోళనకరమన్నారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్స్​న్​. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

UK PM terms Sino-India standoff very serious, worrying situation'; calls for dialogue
భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు ఆందోళనకరం: బోరిస్​

తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు వివాదంపై నెలకొన్న ప్రతిష్టంభనను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భారత్​-చైనాలకు సూచించారు బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​. రెండు దేశాల మధ్య వివాదంపై బ్రిటన్​ సభలో కన్జర్వేటివ్​ పార్టీ ఎంపీ ఫ్లిక్​ డ్రుమోండ్​ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. భారత్​-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు అత్యంత ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు బోరిస్​. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు.

వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇరు దేశాల మధ్య దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. అనంతరం.. లద్దాఖ్​లో శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు గతంలో కుదరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు అంగీకరించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. రెండు దేశాలు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించుకోనునట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: ప్రధానికి షాక్- ప్రతిపక్ష పార్టీలోకి తమ్ముడు

ABOUT THE AUTHOR

...view details