తెలంగాణ

telangana

కరోనాపై పోరు: వారందరికీ విటమిన్​-డీ పంపిణీ!

కొవిడ్​-19తో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. విటమిన్​-డీ లోపం ఉన్నవారిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు పలు పరిశోధనలు సూచించాయి. ఈ క్రమంలో కరోనా తీవ్రతను తగ్గించేందుకు తీవ్ర అనారోగ్యానికి గురైన వారితో పాటు, ఇళ్లలో చికిత్స తీసుకుంటున్న వృద్ధులకు విటమిన్​-డీ మాత్రలను పంపిణీ చేయాలని నిర్ణయించింది బ్రిటన్​ ప్రభుత్వం.

By

Published : Nov 8, 2020, 4:33 PM IST

Published : Nov 8, 2020, 4:33 PM IST

vitamin d
విటమిన్​-డీ పంపిణీ

కరోనా మహమ్మారితో మరణించే ప్రమాదాన్ని తగ్గించేందుకు విటమిన్​-డీ సాయపడుతుందనే నిపుణుల సూచనల మేరకు బ్రిటన్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్​ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి విటమిన్​-డీ మాత్రలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తుది ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

ఇంగ్లాండ్​లో ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్న వృద్ధులు సహా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి శీతాకాలంలో నాలుగు నెలల పాటు విటమిన్​-డీని నేరుగా అందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు అక్కడి మంత్రులు వెల్లడించారు. తాజా నిర్ణయం.. స్కాటిష్​ ప్రభుత్వం చేపట్టిన చర్యలను అనుసరిస్తున్నట్లు ద సండే టెలిగ్రాఫ్​ పేర్కొంది.

వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్​లోని 20 లక్షల మంది తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులు సహా, ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్న వారికి విటమిన్​ డీ మాత్రలను అందించనున్నారు.

" విటమిన్​ డీ అవసరమైన వారందరికీ శీతాకాలం మొత్తం ఉచితంగా అందించనున్నాం. కొవిడ్​-19 బారినపడిన వారిపై విటమిన్​ డీ సానుకూల ప్రభావం చూపుతోందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి."

- సీనియర్​ అధికారి.

బోరిస్​ ప్రకటన..

విటమిన్​ డీ పంపిణీపై కొద్ది రోజుల క్రితం అడిగిన ప్రశ్నకు.. ' విటమిన్​ డీ వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తున్నాం. త్వరలోనే దీనిపై సభకు తెలియజేస్తాం.' అని హౌస్​ ఆఫ్​ కామన్స్​లో వెల్లడించారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.

విటమిన్​-డీ లోపం, కొవిడ్​-19 మధ్య సంబంధాలపై మరింత లోతుగా పరీక్షించేందుకు క్లినికల్​ ట్రయల్స్​కు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'రోగనిరోధక శక్తిపై విటమిన్​ డీ ప్రభావం గురించి మరోమారు పరిశీలించాలని శాస్త్రవేత్తలను కోరాను. గత కొన్ని వారాల క్రితం పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్నాం.' అని గత నెలలో బ్రిటన్​ ఆరోగ్య శాఖ మంత్రి మాట్​ హాన్కాక్​ పేర్కొనటం దానికి బలాన్ని చేకూర్చుతోంది.

ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

విటమిన్​ డీ లోపం ఉన్నవారిలో కరోనాతో మరణించే ప్రమాదం అధికంగా ఉంటుందని ఇప్పటికే పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ విటమిన్​ ద్వారా శరీరంలో కాల్షియం, ఫాస్పేట్​ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. దాంతో ఎముకలు, దంతాలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. సూర్యరశ్మి తగిలిన సమయంలో శరీరం సొంతంగా విటమిన్​ డీ ని తయారు చేసుకుంటుంది.

ఇదీ చూడండి: జర జాగ్రత్త: మీలో ఆ లోపముంటే కరోనా వైరస్‌ ముప్పు మీకే అధికం

ఇది విన్నారా..? వైరస్‌ను 'ఢీ' కొట్టే విటమిన్‌

ABOUT THE AUTHOR

...view details