తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2020, 5:24 AM IST

Updated : Feb 18, 2020, 1:58 AM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​ ఒప్పందానికి బ్రిటన్​ పార్లమెంటు ఆమోదం

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలిగే బ్రెగ్జిట్​ ఒప్పందానికి ఆ దేశ పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.​ గతేడాది బ్రసెల్స్​తో ప్రధాని బోరిస్​ జాన్సన్​ కుదుర్చుకున్న డైవర్స్​ ఒప్పందానికీ బ్రిటన్​ చట్టసభ్యులు పచ్చజెండా ఊపారు.

UK-PARLIAMENT-BREXIT
బ్రెగ్జిట్​ ఒప్పందానికి బ్రిటన్​ పార్లమెంటు ఆమోదం

బ్రెగ్జిట్​ ఒప్పందానికి బ్రిటన్​ పార్లమెంటు ఆమోదం

బ్రెగ్జిట్​ ఒప్పందానికి ఎట్టకేలకు బ్రిటన్​ పార్లమెంటు ఆమోదం లభించింది. ఐరోపా సమాఖ్య నుంచి తమ దేశ నిష్క్రమణకు చట్టసభ సభ్యులు పచ్చజెండా ఊపారు. దిగువ సభలోని ఎంపీలు ఇప్పటికే ఈయూ ఉపసంహరణ ఒప్పంద బిల్లుకు మద్దతు తెలిపారు. అంతే కాకుండా గతేడాది బ్రసెల్స్​తో ప్రధాని బోరిస్​ జాన్సన్​ కుదుర్చుకున్న డైవర్స్​ ఒప్పందానికీ ఎగువ సభ ఆమోదం లభించింది.

అయితే ఎగువ సభ ఈ విషయంలో కొన్ని మార్పులు చేసింది. బ్రెగ్జిట్​ నేపథ్యంలో ఈయూ పౌరులు, పిల్లల శరణార్థుల హక్కులను అందులో చేర్చింది. ఈ ఒప్పందంపై బుధవారం జరిగిన ఓటింగ్​లో అత్యధిక మెజారిటీ సభ్యులు కలిగిన జాన్సన్ ప్రభుత్వం ఐదు సవరణలను తిరస్కరించింది. బ్రెగ్జిట్​పై అధికార ధ్రువీకరణకు ప్రస్తుతం క్వీన్​ ఎలిజబెత్ 2 అంగీకారం తెలపాల్సి ఉంది. ఇది పూర్తైతే జనవరి 31న బ్రిటన్​ ఈయూ నుంచి వైదొలిగేందుకు మార్గం సుగమం అవుతుంది.

బోరిస్​కు ఘన విజయం..

వచ్చేవారం యురోపియన్​ పార్లమెంటు ఈ ఒప్పందానికి మద్దతు తెలపాల్సి ఉంది. అదే జరిగితే లండన్​లో ఇది ఓ చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది. ఎందుకంటే 28 సభ్య దేశాలు కలిగిన ఈయూ నుంచి వైదొలగిన తొలి దేశంగా బ్రిటన్​ నిలుస్తుంది. జాన్సన్​కు తాను పదవి చేపట్టిన కాలంలో ఇదో పెద్ద విజయం అవుతుంది.

మాజీ ప్రధాని థెరిసా మే 2018లో బ్రెగ్జిట్​ ఒప్పందంపై చర్చలు జరిపారు. దిగువ సభ ఈ విషయాన్ని మూడుసార్లు తిరస్కరించింది. థెరిసా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్​... బ్రెగ్జిట్​ను సాకారం చేసేందుకు చాలా కృషి చేశారు. మెజారిటీ లేకపోవడం వల్ల గతనెలలో ఎన్నికలకు వెళ్లారు. జాన్సన్​ అధిక మెజారిటీతో అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఎంపీలు ఈ ఒప్పందానికి మద్దతు పలికారు.

బ్రెగ్జిట్​ లాభం ఎవరెవరికి?

బ్రెగ్జిట్​ ఒప్పందం జరిగితే ఐరోపా సమాఖ్య పౌరుల హక్కులకు రక్షణ లభిస్తుంది. బ్రిటన్​ ప్రావిన్స్​ ఆఫ్​ నార్తర్న్​ ఐర్లాండ్​ కోసం ప్రత్యేక వాణిజ్య ఏర్పాటు జరుగుతుంది. యూకే, ఈయూ అప్పులు కూడా పరిష్కారమవుతాయి.

Last Updated : Feb 18, 2020, 1:58 AM IST

ABOUT THE AUTHOR

...view details