తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2019, 9:09 AM IST

Updated : Oct 2, 2019, 1:29 AM IST

ETV Bharat / international

కశ్మీర్​పై అంతర్జాతీయ జోక్యానికి బ్రిటన్ విపక్షం తీర్మానం

కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని తీర్మానించింది బ్రిటన్ విపక్ష లేబర్​ పార్టీ. కశ్మీర్​లో మానవ హక్కుల పునరుద్ధరణకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఈ తీర్మానాన్ని భారత్​ ఖండించింది. కశ్మీర్​ ముమ్మాటికి తమ అంతర్గత విషయమని మరోమారు తేల్చిచెప్పింది.

కశ్మీర్​పై అంతర్జాతీయ జోక్యానికి బ్రిటన్ విపక్షం తీర్మానం

కశ్మీర్​పై బ్రిటన్​ లేబర్​ పార్టీ తీర్మానం

కశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా బ్రిటన్​లో విపక్ష లేబర్ పార్టీ నిరసన గళాన్ని వినిపించింది. కశ్మీర్​ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ పరిశీలకులు కశ్మీర్​లో పర్యటించి.. ప్రజల హక్కుల కోసం పోరాడాలని పేర్కొంది.

కశ్మీర్ అంశం భారత్​, పాకిస్థాన్​ల మధ్య ఉన్న ద్వైపాక్షిక వ్యవహారమని అధికారికంగా బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇందుకు వ్యతిరేకంగా బ్రిగ్​టన్ వేదికగా జరిగిన వార్షిక సమావేశంలో లేబర్ పార్టీ కశ్మీర్​పై తీర్మానించింది. కశ్మీర్ అంశమై లేబర్ పార్టీ నుంచి ఒక ప్రతినిధిని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య వద్దకు పంపించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత జెరెమీ కార్బిన్.

"కశ్మీర్​ను వివాదాస్పద సరిహద్దుగా పరిగణించి.. తీర్మానాల ప్రకారం ఆ ప్రాంత ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. కశ్మీర్​ ప్రజలకు అండగా మా పార్టీ ఉంటుంది. సామాజిక న్యాయం, నైతిక విదేశాంగ విధానం కోసం మా పార్టీ కట్టుబడి ఉంటుంది."

-- లేబర్​ పార్టీ తీర్మానం.

లేబర్​ పార్టీ తీర్మానాన్ని ప్రవాస భారతీయ సంఘం ప్రతినిధులు ఖండించారు. జెరెమీ కార్బిన్ నేతృత్వంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఇవన్ని ఓటు బ్యాంకు రాజకీయాలే...'

లేబర్​ పార్టీ చేసిన తీర్మానాన్ని భారత్​ ఖండించింది. ఓటు బ్యాంక్​ రాజకీయాలను ప్రోత్సహించడం కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ఈ అంశంపై లేబర్​ పార్టీతో చర్చలు జరపమని తేల్చి చెప్పింది.

ఇదీ చూడండి: అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో మోదీ భేటీ

Last Updated : Oct 2, 2019, 1:29 AM IST

ABOUT THE AUTHOR

...view details