తెలంగాణ

telangana

By

Published : Feb 19, 2020, 2:17 PM IST

Updated : Mar 1, 2020, 8:18 PM IST

ETV Bharat / international

బ్రిటన్​లో​ నూతన వీసా వ్యవస్థ- భారత్​కు​ లబ్ధి!

నూతన వీసా వ్యవస్థను బ్రిటన్​ ప్రవేశపెట్టింది. నైపుణ్యాలకు ప్రాధాన్యం ఉన్న ఈ వ్యవస్థతో భారత్​ సహా అనేక దేశాలు లబ్ధిపొందనున్నాయి. అదే సమయంలో నైపుణ్యం లేని వారికి ఈ 'పాయింట్స్​ ఆధారిత వ్యవస్థ'తో వీసా లభించడం కష్టమే.

Priti Patel launches UK's ‘historic' points-based visa system
బ్రిటన్​లో​ నూతన వీసా వ్యవస్థ- భారత్​కు​ లబ్ధి!

బ్రిటన్​లో​ నూతన వీసా వ్యవస్థ- భారత్​కు​ లబ్ధి!

చారిత్రక పాయింట్స్​ ఆధారిత వీసా వ్యవస్థను బ్రిటన్​ ప్రవేశపెట్టింది. నైపుణ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకునే ఈ నూతన వీసా వ్యవస్థతో భారత్​ సహా ప్రపంచ దేశాలు లబ్ధిపొందనున్నాయి. దీని ద్వారా దేశంలోకి అనవసర, నైపుణ్యం లేని ఉద్యోగుల ప్రవేశానికి అడ్డుకట్ట వేసింది ప్రధాని బోరిస్​ జాన్సన్​ ప్రభుత్వం.

నూతన వీసా వ్యవస్థను ప్రవేశపెట్టిన బ్రిటన్​ హోంమంత్రి ప్రీతి పటేల్​.. నైపుణ్యం, వృత్తి, జీతం వంటివి పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తున్నట్టు వివరించారు. 2021 జనవరి 1న ఈ నూతన వీసా వ్యవస్థ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అప్పటితో ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగే ప్రక్రియ పూర్తికానుంది.

"బ్రిటన్​కు ఇది చారిత్రక ఘట్టం. దేశంలోకి విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రిస్తున్నాం. దీని వల్ల సరిహద్దుపై మరింత పట్టు వస్తుంది. ఈ నూతన వ్యవస్థ ద్వారా వలసదారుల​ సంఖ్య తగ్గుతుంది. ప్రపంచ దేశాల్లోని ప్రతిభావంతులను ఈ వ్యవస్థ ఆకర్షిస్తుంది. దీని వల్ల మన ఆర్థిక వ్యవస్థ, సమాజం మరితం శక్తిమంతంగా మారుతుంది."

-- ప్రీతి పటేల్​, బ్రిటన్​ హోంమంత్రి.

ప్రస్తుతమున్న ఈయూ కార్మిక శక్తిలో 70శాతం మందికి ఈ వీసా పొందేందుకు కావాల్సిన నైపుణ్యం లేదని హోంశాఖ అంచనా వేసింది.

ఇదీ చూడండి:-ప్రకృతిని ఆస్వాదించే పిల్లలకు ఆ లక్షణాలు ఎక్కువే!

Last Updated : Mar 1, 2020, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details