తెలంగాణ

telangana

ఐదు అంచెల విధానంతో కరోనాపై యుద్ధం

లాక్​డౌన్​ మార్గదర్శకాలను సవరిస్తూ బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ కీలక ప్రకటన చేశారు. దేశంలో ఐదు అంచెల అప్రమత్తత వ్యవస్థను ప్రవేశపెట్టారు. త్వరలోనే కరోనా బారి నుంచి బ్రిటన్​కు విముక్తి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

By

Published : May 11, 2020, 11:14 AM IST

Published : May 11, 2020, 11:14 AM IST

VIRUS-UK-LOCKDOWN
బ్రిటన్

బ్రిటన్​లో లాక్​డౌన్​ నిబంధనలను సవరించారు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్​. జూన్​ వరకు లాక్​డౌన్​ పొడిగించిన ఆయన కొత్తగా 'కొవిడ్- 19 అప్రమత్తత విధానాన్ని' ప్రవేశపెట్టారు. భౌతిక దూరం నిబంధనలు కొనసాగినంత కాలం ప్రజలు ఎక్కువ సమయం బయట తిరిగేలా షరతులతో కూడిన ప్రణాళికను ఆవిష్కరించారు.

కరోనా వ్యాప్తి రేటును గుర్తించేందుకు శాస్త్రీయ సమాచారం ఆధారంగా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని జాన్సన్​ తెలిపారు. జాతినుద్దేశించి ప్రసంగించిన బోరిస్.. 'స్టే అలర్ట్​' నినాదంతో​ ఐదు అంచెల అప్రమత్తత వ్యవస్థ విధివిధానాలను ప్రకటించారు.

"ప్రభుత్వం విధించిన ఆంక్షలతో చాలా వరకు పురోగతి సాధించినా పూర్తి స్థాయిలో మనం గెలవలేదు. ఈ పరిస్థితుల్లో లాక్​డౌన్​ను ఎత్తివేయటం సరైన పని కాదు. అందువల్ల మార్గదర్శకాలను సవరించేందుకు వివిధ దశల్లో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే బ్రిటన్​కు పూర్వ వైభవం వస్తుంది. ఆరోగ్యం మన సొంతం అవుతుంది."

- బోరిస్ జాన్సన్​, బ్రిటన్ ప్రధాని

ఐదు దశలు ఇలా..

జాన్సన్​ చెప్పినదాని ప్రకారం దేశంలో వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉంటే ఐదో దశ అని.. వైరస్​ నుంచి బ్రిటన్​కు విముక్తి లభిస్తే ఒకటో దశగా వ్యవహరిస్తారు. మిగిలిన 3 దశలు అవరోహణ క్రమంగా ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో వైరస్​ వ్యాప్తిని అనుసరించి ఈ దశలను నిర్ధరిస్తారు. దాని ప్రకారం భౌతిక దూరం నిబంధనల్లో మార్పులు ఉంటాయని బోరిస్ స్పష్టం చేశారు.

అయితే రెండు మీటర్ల దూరం పాటిస్తూ పార్కులకు, ఇతరులను కలిసేందుకు వెళ్లవచ్చని బోరిస్ తెలిపారు. నదుల్లో ఈత కొట్టేందుకు, టెన్నిస్​, గోల్ఫ్ ఆడేందుకు కుటుంబ సభ్యులతోనే వెళ్లవచ్చని స్పష్టం చేశారు.

ఆర్థిక కార్యకలాపాలపై..

సాధ్యమైనంత వరకు వర్క్​ ఫ్రమ్​ హోమ్ ప్రోత్సహించాలని జాన్సన్​ నిర్దేశించారు. వర్క్​ ఫ్రమ్​ హోమ్ సాధ్యం కాని భవన నిర్మాణం వంటి రంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే కార్మికులు ప్రజా రవాణా వినియోగించవద్దని సూచించారు.

వాణిజ్య కార్యకలాపాల పునరుద్ధరణపై స్పందించిన బోరిస్​.. వచ్చే రెండు నెలల్లో ఆర్థిక పరంగా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

బోరిస్​ ప్రకటించిన తాజా విధానాలు అస్పష్టంగా ఉన్నాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

ఇదీ చూడండి:కరోనాను గెలిచిన దేశాల్లో మళ్లీ కలవరం

ABOUT THE AUTHOR

...view details