తెలంగాణ

telangana

ETV Bharat / international

లండన్:​ ఉగ్రదాడి'లో ఇద్దరు మృతి.. దుండగుడు హతం - latest international news

లండన్​ బ్రిడ్జి వద్ద ఓ దుండగుడు ఉత్తుత్తి బాంబును తగిలించుకుని కత్తితో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటనను స్కాట్లాండ్​ అధికారులు ఉగ్రదాడిగా పరిగణించారు. దుండగుడికి ఐసిస్​ ఉగ్రసంస్థతో సంబంధాలున్నట్లు భద్రతా వర్గాల సమాచారం.

london
లండన్:​ ఉగ్రదాడిలో ముష్కరుడితో సహా ఇద్దరు మృతి

By

Published : Nov 30, 2019, 5:46 AM IST

Updated : Nov 30, 2019, 6:14 AM IST

లండన్:​ ఉగ్రదాడిలో ముష్కరుడితో సహా ఇద్దరు మృతి

లండన్​ స్కాట్​లాండ్​ యార్డ్​ పరిధిలోని ప్రఖ్యాత లండన్​ బ్రిడ్జిపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కొందరు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ జరిగింది..

లండన్​లో ఉగ్రదాడికి తెగించాడు ఓ ముష్కరుడు. నకిలీ బాంబును ఒంటికి చుట్టుకుని చేతిలో కత్తిపట్టుకొని లండన్ బ్రిడ్జిపై ఉన్న వ్యక్తులపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జిపై ఉన్న ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడుతుండగా కొంతమంది అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో దుండగుడు ఇద్దరు వ్యక్తులపై కత్తితో పొడిచాడు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కాల్చి చంపారు.

ఎన్నికల ప్రచారం మధ్యలో..

ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని బోరిస్​ జాన్సన్​.. ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపేశారు. డౌనింగ్​ స్ట్రీట్​కు వచ్చిన ఆయన ఉగ్రవాద ఘటనపై అధికారులతో చర్చించారు. ఉగ్రదాడిని ఖండించారు. సకాలంలో స్పందించిన పోలీసులను అభినందించారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారిపై ప్రగాఢ ​ సానుభూతి తెలిపారు.

"ఈ దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఇతరులను కాపాడటానికి వారి ప్రాణాలను పన్నంగా పెట్టారు. వారు మన దేశ హీరోలు."

-బోరిస్​ జాన్సన్​, ప్రధాన మంత్రి.

దుండగుడి చర్యను ఉగ్రవాద ఘటనగా పరిగణిస్తున్నట్లు స్కాట్​లాండ్​ యార్డ్​ పోలీసు అధికారు తెలిపారు. ఈ దుండగునికి ఐసిస్​తో సంబంధాలున్నట్లు భద్రతా వర్గాల సమాచారం. అతని వద్ద పేలుడు పదార్థాలు ఉండవచ్చని అనుమానంతో అతడిని కాల్చి చంపిన్నట్లు తెలిపారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

గతంలో ఇదే బ్రిడ్జిపై జరిగిన ఉగ్రదాడిలో 11 మంది మృత్యువాత పడ్డారు.

ఇదీ చూడండి : రేపే ఝార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు

Last Updated : Nov 30, 2019, 6:14 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details