ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి ధాటికి అగ్రరాజ్యాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 4,68,905 మందికి వైరస్ సోకింది. 21, 200మంది మృతి చెందారు. కరోనా బారిన పడ్డవారిలో లక్షా 14వేల మంది కోలుకున్నారు. అందులో ఎక్కువ మంది చైనాకు చెందిన వారే కావడం గమనార్హం.
ఇటలీలో మరో 683మంది మృతి..
కరోనా విజృంభనతో ఇటలీ వణికిపోతోంది. రోజురోజుకు పెరిగిపోతున్న మరణాలు ఆ దేశ ప్రభుత్వాన్ని, పౌరులను మరింత కలవరపెడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 683మంది మృతి చెందారు. రెండు వారాలుగా అక్కడ లాక్డౌన్ కొనసాగుతోంది.