తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2020, 5:29 AM IST

Updated : Feb 28, 2020, 2:33 AM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​ స్మారక చిహ్నంగా నూతన 'నాణెం' విడుదల

ఐరోపా సమాఖ్య  నుంచి బ్రిటన్​ వైదొలిగే ముందు బ్రెగ్జిట్​  స్మారక చిహ్నంగా ఓ ప్రత్యేక  నాణేన్ని ముద్రించింది యూకే ప్రభుత్వం. జనవరి 31 నుంచి 30 లక్షలకు పైగా నాణేలను అన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

brexit
బ్రెగ్జిట్​ స్మారక చిహ్నంగా నూతన నాణెం విడుదల

ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి బ్రిటన్​ వైదొలిగే ముందు బ్రెగ్జిట్​కు​ ప్రతీకగా ఓ ప్రత్యేక నాణెం విడుదల చేసింది యూకే సర్కారు.శాంతి, శ్రేయస్సు, అన్ని దేశాలతో స్నేహం అనే సందేశంతో కూడిన '50 పెన్స్'​ విలువగల బ్రెగ్జిట్ స్మారక నాణేన్ని రూపొందించింది. బ్రెగ్జిట్ సందర్భంగా జనవరి 31 నుంచి 30లక్షలకు పైగా నాణేలు అన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం 70లక్షల నాణేలు చెలామణిలోకి రానున్నాయి.

ఈ కొత్త నాణెం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బ్రిటన్​ ఛాన్సులర్​ సజిద్​ జావిద్​.

ఈ నాణేలను పొందటానికిఇప్పటికే 13వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ ముద్రణ సంస్థ రాయల్​ మింట్ తెలిపింది. 2019 అక్టోబర్​ 31కి ముందే ఈ నాణేల తయారీకీ జావిద్​ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత బ్రెగ్జిట్​ బిల్లు పార్లమెంట్​లో ఆమోదం పొందలేదు. ఫలితంగా ఆనాడే ముద్రించిన 10లక్షల నాణేలన్నింటినీ కరిగించి తాజాగా మరోసారి నూతన నాణేలను తయారు చేసింది ప్రభుత్వం.

ఇదీ చదవండి:విమానాలపై లేజర్​లైట్​... చివరికి అరెస్ట్​!

Last Updated : Feb 28, 2020, 2:33 AM IST

ABOUT THE AUTHOR

...view details