తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా

తమ దేశ దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించడంపై రష్యా కూడా అదే తీరులో స్పందించింది. ఆ దేశంలోని పదిమంది అమెరికా దౌత్యాధికారులను బహిష్కరించింది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్న రష్యన్ సంస్థలకు సహకరించిన ఆరుగురు పాకిస్థానీ పౌరులపైనా ఆంక్షలు విధించింది అమెరికా.

By

Published : Apr 17, 2021, 5:19 AM IST

usa-russaia
రష్యా-అమెరికా

అమెరికాలో తమ దౌత్యవేత్తల బహిష్కరణపై స్పందించిన రష్యా.. 10 మంది అగ్రరాజ్య దౌత్యాధికారులను బహిష్కరించింది. వీరితో పాటు.. మరో ఎనిమిది మంది అమెరికా అధికారులపై ఆంక్షలు విధించనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ప్రకటించారు. అంతేగాక రష్యా రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తమ దేశంలో అమెరికా వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అవకాశాలున్నప్పటికీ.. వెంటనే అమలు చేయబోమని లావ్రో చెప్పారు.

'పోలింగ్​ డేటా లీక్​..'

2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికా వాదిస్తోంది. ట్రంప్ ప్రచారానికి సంబంధించిన డేటాను రష్యా అక్రమంగా పొందిందని తెలిపింది. రష్యా-2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. రష్యా, ఉక్రేనియా రాజకీయ సలహాదారు కాన్​స్టాంటిన్ కిలిమ్నిక్​తో అమెరికా ఎన్నికల ప్రచార ఛైర్మన్ పాల్ మనాఫోర్ట్ పోలింగ్ డేటాను ఎందుకు పంచుకున్నారని యూఎస్​ ట్రెజరీ డిపార్ట్​మెంట్ ప్రశ్నించింది. కిలిమ్నిక్​కు రష్యా ఇంటెలిజెన్స్‌తో సంబంధాలున్నాయని అమెరికా చాలాకాలంగా ఆరోపిస్తోంది.

పాక్​ పౌరులపై అగ్రరాజ్యం ఆంక్షలు..

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని.. మోసపూరిత పత్రాల ద్వారా ఆంక్షలను తప్పించుకోవడానికి చూసిందని అమెరికా ఆరోపించింది. ఈ క్రమంలో రష్యన్ సంస్థలకు సహకరించిన ఆరుగురు పాకిస్థానీ పౌరులపై ఆంక్షలు విధించింది. వారికి సంబంధించిన నాలుగు కంపెనీలపైనా చర్యలు తీసుకుంది. అమెరికా ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు ప్రయత్నించే వారికి వీరు సాయం చేశారని మండిపడింది.

ఖండించిన రష్యా..

2020 అధ్యక్ష ఎన్నికలు సహా.. ఫెడరల్ ఏజెన్సీల విధుల్లో జోక్యం వంటి వాటిని రష్యా ఖండించింది. తాజా పరస్పర ఆంక్షలను అనివార్యమైన ప్రతీకారంగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తాయని.. అందుకు వాషింగ్టన్ మూల్యం చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించింది.

ఉగాండాలో ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం: అమెరికా

జనవరిలో జరిగిన ఉగాండా ఎన్నికల్లో అవకతవకలు, ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు సహకరించిన వారిపై వీసా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఈ ఆంక్షలు ఎవరిపై ప్రభావితం చూపుతాయే వెల్లడించలేదు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పట్ల ఉగాండా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయమని బ్లింకెన్​ పేర్కొన్నారు. దీర్ఘకాల అధ్యక్షుడు యోవేరి ముసెవెని అక్రమంగా గెలిచారని(6వ సారి).. ప్రజలకు రాజకీయ స్వేచ్ఛ కరవైందని, ఎన్నికలు న్యాయ సమ్మతంగా లేవని అభిప్రాయపడ్డారు.

ప్రత్యర్థులపై వేధింపులు, అరెస్టులతో పాటు.. అమాయక ప్రజల మరణాలకు ఉగాండా భద్రతా దళాలు కారణమయ్యాయని వివరించారు. జర్నలిస్టులనూ హింసించారని మండిపడ్డారు.

ఇవీ చదవండి:'చైనాతో సహకారం కంటే సంఘర్షణకే అమెరికా మొగ్గు'

'భారత్​ను దెబ్బకొట్టేందుకు​ చైనా కొత్త ఎత్తులు'

ABOUT THE AUTHOR

...view details